Telugu Global
NEWS

ఓటుకు నోటు... మళ్లీ "స్టే" కోసం వెళ్లిన చంద్రబాబు

ఓటుకు నోటు కేసులో ఊహించినదే జరుగుతోంది. విచారణపై స్టే తెచ్చుకునేందుకు చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబుపై విచారణ జరపాలంటూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేయాలని పిటిషన్‌లో కోరారు. తెలంగాణలో ఎమ్మెల్యే స్టిఫెన్ సన్ ను కొనేందుకు డబ్బులు ఇచ్చిన వ్యవహారం అవినీతినిరోధక చట్టం పరిధిలోకి రాదని చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు వాదిస్తున్నారు. ఈ కోణంలోనే స్టే తెచ్చుకునేందుకు […]

ఓటుకు నోటు... మళ్లీ స్టే కోసం వెళ్లిన చంద్రబాబు
X

ఓటుకు నోటు కేసులో ఊహించినదే జరుగుతోంది. విచారణపై స్టే తెచ్చుకునేందుకు చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబుపై విచారణ జరపాలంటూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేయాలని పిటిషన్‌లో కోరారు. తెలంగాణలో ఎమ్మెల్యే స్టిఫెన్ సన్ ను కొనేందుకు డబ్బులు ఇచ్చిన వ్యవహారం అవినీతినిరోధక చట్టం పరిధిలోకి రాదని చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు వాదిస్తున్నారు. ఈ కోణంలోనే స్టే తెచ్చుకునేందుకు చంద్రబాబు కోర్టును ఆశ్రయించారు. తనపై విచారణ జరగకుండా ప్రతికేసులోనూ చంద్రబాబు స్టే తెచ్చుకుని తప్పించుకుంటున్నారన్న అభిప్రాయం ఇప్పటికే బలంగా ఉంది. చూడాలి ఓటుకు నోటు కేసులోనూ అదే పునరావృతం అవుతుందేమో!. పిటిషన్ ను స్వీకరించిన కోర్టు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

14 నెలల క్రితం ఓటుకు కోట్లు ఇస్తూ రేవంత్ రెడ్డి ఆడియో, వీడియో టేపుల్లో దొరికిపోయారు. అనంతరం చంద్రబాబు ఆడియో టేపులు కూడా బయటకు వచ్చాయి. తొలుత కేసు విషయంలో తెగ హడావుడి చేసిన కేసీఆర్ ప్రభుత్వం అనంతరం సైలెట్ అయిపోయింది. చంద్రబాబు, కేసీఆర్ రాజీ పడ్డారన్న విమర్శలు వచ్చాయి. ఇంతలోనే రెండు రోజుల క్రితం ఆడియో టేపుల్లో ఉన్నది చంద్రబాబు వాయిసేనని ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్దారించిన నివేదికను ఏసీబీకి కోర్టుకు వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సమర్పించారు. వెంటనే చంద్రబాబుపై విచారణకు ఆదేశించాలని కోరారు. ఇందుకు అంగీకరించిన ఏసీబీ కోర్టు సెప్టెంబర్ 29లోగా ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రను తేల్చాలని ఏసీబీని ఆదేశించింది. దీంతో తిరిగి తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కదలిక మొదలైంది. టీడీపీ నేతలు మాత్రం ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం కిందకు రాదని వాదిస్తూ వస్తున్నారు. ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులు పంచిన సమయంలో నమోదు చేసే పిట్టికేసు తరహాలోనే స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన కేసు ఇది అంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు హైకోర్టును స్టే కోసం ఆశ్రయించారు.

Click on Image to Read:

reliance jio

motkupalli narasimhulu

chandrababu vote for note case

karem shivaji

chandrababu naidu

somireddy

revanth reddy karimnagar jail

Stephenson

lokesh driver kondal reddy

chandrababu naidu ntr health university

guntru to anantapur water tankers

balakrishna car accident

governor narasimhan vote for note case chandrababu

undavalli-arun-kumar

First Published:  1 Sep 2016 2:22 AM GMT
Next Story