టాప్ సీటు కోసమే వెంకయ్య అలా చేస్తున్నారట...
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రం చెప్పడాన్ని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ తప్పుపట్టారు. హోదా ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ ఏటా రూ.60వేల కోట్లు నష్టపోతుందన్నారు. ఏపీకి హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పలేదన్నారు. హోదా ఇవ్వని పాపం ఎన్డీయేదేనన్నారు. జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని రాష్ట్ర్ర ప్రభుత్వానికి అప్పగించడం సాధ్యం కాదన్నారు. అలా చేయాలంటే తిరిగి చట్టసవరణ చేయాల్సి ఉంటుందన్నారు. వెంకయ్యనాయుడు ఒక సీనియర్ మంత్రి తరహాలో మాట్లాడడం లేదన్నారు. ఉపరాష్ట్రపతి కావాలన్న కోరికతోనే వెంకయ్యనాయుడు […]
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రం చెప్పడాన్ని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ తప్పుపట్టారు. హోదా ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ ఏటా రూ.60వేల కోట్లు నష్టపోతుందన్నారు. ఏపీకి హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పలేదన్నారు. హోదా ఇవ్వని పాపం ఎన్డీయేదేనన్నారు. జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని రాష్ట్ర్ర ప్రభుత్వానికి అప్పగించడం సాధ్యం కాదన్నారు. అలా చేయాలంటే తిరిగి చట్టసవరణ చేయాల్సి ఉంటుందన్నారు. వెంకయ్యనాయుడు ఒక సీనియర్ మంత్రి తరహాలో మాట్లాడడం లేదన్నారు. ఉపరాష్ట్రపతి కావాలన్న కోరికతోనే వెంకయ్యనాయుడు ఇలా చేస్తున్నారని జైరాం రమేష్ విమర్శించారు. కాంగ్రెస్ను విమర్శించడం మానుకుని ముందు ఏపీకి న్యాయం చేయాలని జైరాం డిమాండ్ చేవారు.
Click on Image to Read: