సంతానం కోసం అక్కడికెళ్లింది!
‘నువ్వ-నేను’ చిత్రం ద్వారా తెలుగుతెరకు ప్రత్యక్షమైన అనిత అలియాస్ అనితా హసన్ నందినీ రెడ్డి. ఆ చిత్రం హిట్ అయిన దరిమిలా తమిళ, కన్నడ భాషల్లో కొంతకాలంపాటు బిజీగా మారింది. ఇటీవల అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో వెండితెరపై పెద్దగా కనిపించడం లేదు. 2013లో రోహిత్ రెడ్డితో వివాహం తరువాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంది. చాలాకాలం తరువాత మళ్లీ ఆర్పీ పట్నాయక్ దర్శకత్వం వహించిన ‘మనలోఒకడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది అనిత. ఈ చిత్రం విజయవంతం […]
BY sarvi20 Sep 2016 1:15 AM GMT
X
sarvi Updated On: 20 Sep 2016 1:50 AM GMT
‘నువ్వ-నేను’ చిత్రం ద్వారా తెలుగుతెరకు ప్రత్యక్షమైన అనిత అలియాస్ అనితా హసన్ నందినీ రెడ్డి. ఆ చిత్రం హిట్ అయిన దరిమిలా తమిళ, కన్నడ భాషల్లో కొంతకాలంపాటు బిజీగా మారింది. ఇటీవల అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో వెండితెరపై పెద్దగా కనిపించడం లేదు. 2013లో రోహిత్ రెడ్డితో వివాహం తరువాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంది. చాలాకాలం తరువాత మళ్లీ ఆర్పీ పట్నాయక్ దర్శకత్వం వహించిన ‘మనలోఒకడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది అనిత. ఈ చిత్రం విజయవంతం కావాలని శ్రీకాళహస్తికి వచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఆమెను పలకరించిన విలేకరులకు అసలు విషయం చెప్పింది. తన చిత్రం విజయవంతం కావాలని అలాగే తనకు సంతానం కలగాలని దేవుడిని ప్రార్థించేందుకు వచ్చానని వెల్లడించింది.
Next Story