Telugu Global
CRIME

పీకలదాకా తాగి.... సీతారామన్‌ను హత్య చేసేందుకు....

ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో సాగించిన చాటింగ్‌ పోలీసులను పరుగులు పెట్టించింది. ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా ఉత్తరాఖండ్‌లోని పిథోరగడ్‌ జిల్లాలో రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఒక మెగా మెడికల్ క్యాంపును సోమవారం ప్రారంభించాల్సి ఉంది. ఆ విషయం తెలుసుకున్న ఇద్దరు వ్యక్తులు ముందు రాత్రి నిర్మలా సీతారామన్‌ను చంపేయాలని చాటింగ్ చేసుకున్నారు. ఆవిషయాన్ని వాట్సాప్‌ గ్రూప్‌లో కూడా షేర్ చేశారు. చాటింగ్ చేసిన వారిలో ఒక వ్యక్తి నిర్మలా సీతారామన్‌ను నేను కాల్చి […]

పీకలదాకా తాగి.... సీతారామన్‌ను హత్య చేసేందుకు....
X

ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో సాగించిన చాటింగ్‌ పోలీసులను పరుగులు పెట్టించింది. ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా ఉత్తరాఖండ్‌లోని పిథోరగడ్‌ జిల్లాలో రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఒక మెగా మెడికల్ క్యాంపును సోమవారం ప్రారంభించాల్సి ఉంది.

ఆ విషయం తెలుసుకున్న ఇద్దరు వ్యక్తులు ముందు రాత్రి నిర్మలా సీతారామన్‌ను చంపేయాలని చాటింగ్ చేసుకున్నారు. ఆవిషయాన్ని వాట్సాప్‌ గ్రూప్‌లో కూడా షేర్ చేశారు. చాటింగ్ చేసిన వారిలో ఒక వ్యక్తి నిర్మలా సీతారామన్‌ను నేను కాల్చి చంపేస్తా. రేపే ఆమెకు చివరి రోజు అని వ్యాఖ్యానించాడు.

వాట్సాప్ గ్రూప్‌లో ఈ మేసేజ్‌ పోలీసులకు చేరింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిర్మలా సీతారామన్ రావడం కంటే ముందే సోమవారం ఉదయం వాళ్ళను అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో వారిద్దరూ అలా చాటింగ్ చేసుకున్నట్టు పోలీసులు తేల్చారు. అయితే వారికి ఏమైనా నేరచరిత్ర ఉందా అన్న కోణంలో విచారిస్తున్నారు.

First Published:  18 Sep 2018 4:10 AM GMT
Next Story