క్రికెట్ బ్యాట్తో తల్లిని కొట్టి చంపిన కొడుకు
హైదరాబాద్లో ఓ కసాయి కొడుకు… కన్నతల్లిని దారుణంగా హతమార్చాడు. తిండి తినే సమయంలో క్షణికావేశంలో రెచ్చిపోయాడు. క్రికెట్ బ్యాట్తో తల్లి బుర్ర పగలగొట్టాడు. ఈ దారుణ సంఘటన బంజారా హిల్స్లో నందీనగర్లో చోటు చేసుకుంది. సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నందీనగర్లో నివాసముంటున్న గోపీ అనే వ్యక్తి సోమవారం రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. అతడికి అన్నం పెట్టిన వెంటనే తల్లి సక్కుభాయ్ నిద్రలోకి జారుకుంది. మరొకొంత అన్నం కావలసినపుడు గోపీ సోదరి […]
హైదరాబాద్లో ఓ కసాయి కొడుకు… కన్నతల్లిని దారుణంగా హతమార్చాడు. తిండి తినే సమయంలో క్షణికావేశంలో రెచ్చిపోయాడు. క్రికెట్ బ్యాట్తో తల్లి బుర్ర పగలగొట్టాడు. ఈ దారుణ సంఘటన బంజారా హిల్స్లో నందీనగర్లో చోటు చేసుకుంది. సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నందీనగర్లో నివాసముంటున్న గోపీ అనే వ్యక్తి సోమవారం రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. అతడికి అన్నం పెట్టిన వెంటనే తల్లి సక్కుభాయ్ నిద్రలోకి జారుకుంది. మరొకొంత అన్నం కావలసినపుడు గోపీ సోదరి రాణి అతడికి అన్నం పెట్టింది. అది కూడా తిన్న తర్వాత మరికొంత అన్నం కావాలని గోపీ కోరాడు. దీంతో విసుగు చెందిన రాణీ కిచెన్లోకి వెళ్లి వడ్డించుకో అని సమాధానం చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన గోపీ పక్కనే ఉన్న బ్యాట్తో ఆమె తలపై కొట్టాడు. భరించలేని నొప్పితో ఆమె కేకలు పెట్టేసరికి ..తల్లికి మెళుకువ వచ్చింది.గోపీని వారించేందుకు ప్రయత్నించింది. దీంతో తల్లిని కూడా బ్యాట్తో బలంగా కొట్టాడు.
సక్కుభాయ్ ఇంట్లోంచి కేకలు వినిపించడంతో చుట్టుపక్కల వాళ్లు కలగజేసుకున్నారు. సక్కుభాయ్ని, రాణిని ఆసుపత్రికి తరలించారు. రెండు రోజుల పాటు ప్రాణాలతో పోరాడిన ఆమె నిన్నరాత్రి చనిపోయింది. రాణి పరిస్థితి కూడా విషమంగా ఉంది.
తల్లిని చెల్లిని కర్కషంగా కొట్టిన గోపీని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేశారు. ఈ సంఘటన జరుగుతున్నప్పుడు అక్కడే ఉన్న గోపీ భార్య ను కూడా పోలీసులు విచారించేందుకు సిద్ధమయ్యారు. ఆమె ప్రస్తుతం తన పుట్టింట్లో ఉంది.