Telugu Global
CRIME

ఈసారి ప్రతీకార హత్య.... హైదరాబాద్ లో దారుణం....

మిర్యాలగూడలో జరిగిన పరువు హత్యను మరిచిపోక ముందే తాజాగా హైదరాబాద్ లో పట్టపగలు అందరూ చూస్తుండగానే గొడ్డలితో ప్రతీకార హత్యకు ఓ వ్యక్తి పాల్పడ్డాడు. చుట్టూ జనం ఆపడానికి ప్రయత్నించినా…. పోలీసులు అడ్డు చెప్పినా వినకుండా రోడ్డుపై గొడ్డలితో చచ్చే వరకూ నరికేశాడు. ఈ దారుణం హైదరాబాద్ నగర శివారు రాజేంద్రనగర్ పరిధి అత్తాపూర్ లో జరిగింది. హైదరాబాద్ సిద్ది అంబర్ బజారుకు చెందిన రమేష్ (35) అనే వ్యక్తి ఓ హత్య కేసులో ఉప్పరపల్లి కోర్టుకు […]

ఈసారి ప్రతీకార హత్య.... హైదరాబాద్ లో దారుణం....
X

మిర్యాలగూడలో జరిగిన పరువు హత్యను మరిచిపోక ముందే తాజాగా హైదరాబాద్ లో పట్టపగలు అందరూ చూస్తుండగానే గొడ్డలితో ప్రతీకార హత్యకు ఓ వ్యక్తి పాల్పడ్డాడు. చుట్టూ జనం ఆపడానికి ప్రయత్నించినా…. పోలీసులు అడ్డు చెప్పినా వినకుండా రోడ్డుపై గొడ్డలితో చచ్చే వరకూ నరికేశాడు. ఈ దారుణం హైదరాబాద్ నగర శివారు రాజేంద్రనగర్ పరిధి అత్తాపూర్ లో జరిగింది.

హైదరాబాద్ సిద్ది అంబర్ బజారుకు చెందిన రమేష్ (35) అనే వ్యక్తి ఓ హత్య కేసులో ఉప్పరపల్లి కోర్టుకు బుధవారం వచ్చాడు. తిరిగి మధ్యాహ్నం ఆటోలో ఇంటికి వెళ్తుండగా…. ఇద్దరు వ్యక్తులు అడ్డగించారు. దీంతో రమేష్ పారిపోవడానికి ప్రయత్నించాడు.

అత్తాపూర్ లోని ఫ్లై ఓవర్ వద్ద రమేష్ ను పట్టుకున్న ఇద్దరు దుండగులు… అందులో ఒకరు నడిరోడ్డుపైనే గొడ్డలితో కసితీరా నరికి చంపేశాడు. అక్కడికి పోలీసులు వచ్చి అడ్డుచెప్పినా వినకుండా చనిపోయే వరకూ నరుకుతూనే ఉన్నాడు.

ఈ హత్యకు రమేష్ గతంలో చేసిన హత్యే కారణమని పోలీసులు చెబుతున్నారు. రమేష్ భార్యతో మహేష్ అనే యువకుడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో పగ పెంచుకున్న రమేష్ పథకం ప్రకారం మహేష్ ను చంపేశాడు. ఇప్పుడా హత్య కేసులోనే జైలు పాలై బెయిల్ తీసుకొని కోర్టుకు హాజరవుతున్నాడు.

తన కొడుకును చంపిన రమేష్ ను హత్య చేయాలని పథకం పన్నిన మహేష్ తండ్రి, బంధువు కోర్టు నుంచి వస్తున్న రమేష్ ను కాపుకాసి గొడ్డలితో నరికి చంపేశారు. మొన్నీ మధ్య ఎర్రగడ్డలో కుమార్తెను నరికిన తండ్రి ఉందంతం మరిచిపోకముందే ఇప్పుడు అత్తాపూర్ లో నడిరోడ్డు మీద హత్య జరగడం కలకలం రేపింది. ఈ హత్య సీసీటీవీలో రికార్డు కావడంతో అది వైరల్ గా మారింది.

First Published:  26 Sep 2018 5:20 AM GMT
Next Story