Telugu Global
NEWS

కిడారి హత్య కూడా వైసీపీ పనే అంటున్న టీడీపీ ఎమ్మెల్యే

ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక విషయం బాగా ప్రచారంలో ఉంది. ”రాష్ట్రంలో ఏది జరిగినా అందుకు జగనే కారణం, వర్షాలు రాకపోయినా జగన్‌ కుట్రే, తునిలో రైతు తగలబడినా జగన్‌ కుట్రే. పెట్టుబడులు రాకపోయినా వైసీపీ కుట్రే. రాజధానికి రైతులు భూములు ఇవ్వకపోయినా వైసీపీ కుట్రే. చంద్రబాబు అవినీతిపై కోర్టుకు ఎవరైనా వెళ్తే దాని వెనుక జగనే. ఉపాధి హామీ నిధులను కేంద్రం ఆపేస్తే దాని వెనుకా వైసీపీ కుట్రే. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చాంబర్లోకి […]

కిడారి హత్య కూడా వైసీపీ పనే అంటున్న టీడీపీ ఎమ్మెల్యే
X

ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక విషయం బాగా ప్రచారంలో ఉంది. ”రాష్ట్రంలో ఏది జరిగినా అందుకు జగనే కారణం, వర్షాలు రాకపోయినా జగన్‌ కుట్రే, తునిలో రైతు తగలబడినా జగన్‌ కుట్రే. పెట్టుబడులు రాకపోయినా వైసీపీ కుట్రే. రాజధానికి రైతులు భూములు ఇవ్వకపోయినా వైసీపీ కుట్రే. చంద్రబాబు అవినీతిపై కోర్టుకు ఎవరైనా వెళ్తే దాని వెనుక జగనే. ఉపాధి హామీ నిధులను కేంద్రం ఆపేస్తే దాని వెనుకా వైసీపీ కుట్రే. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చాంబర్లోకి వర్షం నీరు వస్తే అందుకు కారణం వైసీపీ వారే … ” అంటూ టీడీపీ తీరును ఎద్దేవా చేస్తూ సోషల్ మీడియాలో ఈ అంశం బాగా చక్కర్లు కొడుతోంది. ఈ జాబితాలోకి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్యను కూడా చేర్చింది టీడీపీ.

కిడారి హత్య వెనుక వైసీపీ హత్యముందని టీడీపీ విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఆరోపించారు. వైసీపీ మద్దతుతోనే నక్సలైట్లు కిడారిని హత్య చేశారని ఆరోపించారు ఎమ్మెల్యే. కిడారి సర్వేశ్వరరావు మూడు నెలలుగా మైనింగ్ జోలికి వెళ్లడం లేదని.. కాబట్టి మైనింగ్‌ కోణంలో హత్య జరిగే అవకాశమే లేదన్నారు. రాజకీయ కక్షతోనే కిడారి, సోమా హత్యలు జరిగాయని టీడీపీ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.

వైసీపీ మద్దతుతో రాజకీయ కోణంలోనే ఈ హత్యలు జరిగాయని చెప్పారు. కిడారి హత్య వెనుక వైసీపీ హస్తం కోణంలోనూ దర్యాప్తు చేయాల్సిందిగా పోలీసు అధికారులను కోరుతామని ఎమ్మెల్యే గణేష్ చెప్పారు. సో… ఎమ్మెల్యే చెప్పిన దాని బట్టి మావోయిస్టులు కూడా జగన్‌ నాయకత్వంలోనే పనిచేస్తున్నారని అనుకోవాలన్న మాట.

First Published:  28 Sep 2018 12:00 AM GMT
Next Story