Telugu Global
Cinema & Entertainment

ప్రత్యేక అతిథులు లేరు.. వాళ్లలో వాళ్లే!

మరికొన్ని గంటల్లో అరవింద సమేత ప్రీ-రిలీజ్ ఫంక్షన్ అట్టహాసంగా జరగనుంది. ఈ ఫంక్షన్ కు బాలకృష్ణ ప్రత్యేక అతిథిగా రాబోతున్నాడంటూ ప్రచారం జరిగింది. మరోవైపు కల్యాణ్ రామ్ కూడా వస్తాడంటూ కథనాలు వచ్చాయి. అయితే కల్యాణ్ రామ్ సంగతి పక్కనపెడితే, బాలయ్య మాత్రం ఈ ఫంక్షన్ కు రావడం లేదు. ఈ విషయాన్ని మేకర్స్ స్పష్టంచేశారు. హైదరాబాద్ నోవోటెల్ హోటల్ లో సాయంత్రం జరగనున్న ఈ ఫంక్షన్ ను తమకుతానే డీసెంట్ గా సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. […]

ప్రత్యేక అతిథులు లేరు.. వాళ్లలో వాళ్లే!
X

మరికొన్ని గంటల్లో అరవింద సమేత ప్రీ-రిలీజ్ ఫంక్షన్ అట్టహాసంగా జరగనుంది. ఈ ఫంక్షన్ కు బాలకృష్ణ ప్రత్యేక అతిథిగా రాబోతున్నాడంటూ ప్రచారం జరిగింది. మరోవైపు కల్యాణ్ రామ్ కూడా వస్తాడంటూ కథనాలు వచ్చాయి. అయితే కల్యాణ్ రామ్ సంగతి పక్కనపెడితే, బాలయ్య మాత్రం ఈ ఫంక్షన్ కు రావడం లేదు. ఈ విషయాన్ని మేకర్స్ స్పష్టంచేశారు.

హైదరాబాద్ నోవోటెల్ హోటల్ లో సాయంత్రం జరగనున్న ఈ ఫంక్షన్ ను తమకుతానే డీసెంట్ గా సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అంటే ప్రత్యేక అతిథి ఎన్టీఆర్ మాత్రమే. త్రివిక్రమ్, పూజా హెగ్డే, సునీల్ స్పెషల్ ఎట్రాక్షన్ అన్నమాట. అటు ఫ్యాన్స్ కు కూడా అందరికీ అనుమతి లభించలేదు. భద్రతా కారణాల వల్ల కొద్దిమందిని మాత్రమే అనుమతిస్తున్నారు.

ఇక ఈ సినిమా ట్రయిలర్ ను ప్రీ-రిలీజ్ ఫంక్షన్ వేదికపైనే కాకుండా, సోషల్ మీడియాలో సాయంత్రం 8 గంటల 10 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. ట్రయిలర్ తో సినిమాపై అంచనాలు మరింత పెరుగుతాయని ఊహిస్తున్నారు. దసరా కానుకగా ఈనెల 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది అరవింద సమేత చిత్రం

First Published:  2 Oct 2018 9:39 PM GMT
Next Story