Telugu Global
NEWS

ఏలూరు ఆఫర్ ఇచ్చారు.... కానీ రాజ్యసభకు వెళ్లాలని ఉంది....

నిజాయితీపరుడిగా పేరున్న ఎమ్మెల్సీ ఆర్‌ సూర్యారావుపై రాజకీయ పార్టీలు వలేస్తున్నాయి. ఆయన్ను వచ్చే ఎన్నికల బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏలూరు టికెట్ ఇచ్చేందుకు పలు పార్టీలు సిద్ధమంటున్నాయి. అయితే సూర్యారావు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. కొన్ని నెలల క్రితం వైసీపీ నేతలు కూడా ఆయన్ను సంప్రదించినట్టు చెబుతున్నారు. అసెంబ్లీ టికెట్ ఆఫర్ చేయగా… ఎటూ తేల్చుకోలేకపోయారు. దీంతో ఏలూరు అసెంబ్లీ అభ్యర్థిగా ఆళ్లనానిని ప్రకటించారు. ఇప్పుడు జనసేన కూడా సూర్యారావుకు గాలం వేస్తోంది. తమ పార్టీలోకి రావాల్సిందిగా […]

ఏలూరు ఆఫర్ ఇచ్చారు.... కానీ రాజ్యసభకు వెళ్లాలని ఉంది....
X

నిజాయితీపరుడిగా పేరున్న ఎమ్మెల్సీ ఆర్‌ సూర్యారావుపై రాజకీయ పార్టీలు వలేస్తున్నాయి. ఆయన్ను వచ్చే ఎన్నికల బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏలూరు టికెట్ ఇచ్చేందుకు పలు పార్టీలు సిద్ధమంటున్నాయి. అయితే సూర్యారావు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. కొన్ని నెలల క్రితం వైసీపీ నేతలు కూడా ఆయన్ను సంప్రదించినట్టు చెబుతున్నారు. అసెంబ్లీ టికెట్ ఆఫర్ చేయగా… ఎటూ తేల్చుకోలేకపోయారు. దీంతో ఏలూరు అసెంబ్లీ అభ్యర్థిగా ఆళ్లనానిని ప్రకటించారు. ఇప్పుడు జనసేన కూడా సూర్యారావుకు గాలం వేస్తోంది. తమ పార్టీలోకి రావాల్సిందిగా కొద్ది రోజుల క్రితం పవన్‌కల్యాణే నేరుగా ఆయన్ను కోరారు.

ఏలూరు అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా పవన్ కల్యాణ్ కోరినట్టు సమాచారం. అయితే సూర్యారావు అందుకు సిద్దంగా లేరని చెబుతున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు చాలా పోటీతత్వంలో ఉంటాయని భావిస్తున్న నేపథ్యంలో నేరుగా అసెంబ్లీ పోటీకి ఆయన సుముఖంగా లేరని సమాచారం.

ఈ వార్తలపై సూర్యారావు స్పందించారు. కొన్నిపార్టీల నుంచి ఏలూరు అసెంబ్లీ స్థానం ఆఫర్ వచ్చిన మాట వాస్తవమేనన్నారు. అయితే ఇప్పటి వరకు తన అభిప్రాయాన్ని ఎవరికీ చెప్పలేదన్నారు. తనకు నేరుగా రాజ్యసభకు వెళ్లాలని ఉందని సూర్యారావు మనసులో మాట బయటపెట్టారు. అది కూడా ప్రజా సేవ చేయాలన్న ఉద్దేశంతో మాత్రమేనన్నారు.

First Published:  9 Oct 2018 6:32 AM GMT
Next Story