Telugu Global
NEWS

గిడ్డి ఈశ్వరి పై మావోయిస్టుల సంచలన లేఖ

ఇటీవల ఫిరాయింపు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమాపై దాడి చేసిన మావోయిస్టులు ఆ ఘటనపై స్పందించకుండా మౌనంగా ఉంటూ వచ్చారు. కిడారిని హత్య చేయడానికి ముందు అతడు పార్టీ మారిన సమయంలో ఎంత డబ్బు తీసుకున్నది ఆరా తీశారని ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పారు. మావోయిస్టుల టార్గెట్‌లో మరో ఫిరాయింపు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కూడా ఉన్నారని తెలుసుకున్న పోలీసులు ఆమెకు భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే దాడి చేసిన ఇన్నాళ్లకు మావోయిస్టు సెంట్రల్ కమిటీ […]

గిడ్డి ఈశ్వరి పై మావోయిస్టుల సంచలన లేఖ
X

ఇటీవల ఫిరాయింపు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమాపై దాడి చేసిన మావోయిస్టులు ఆ ఘటనపై స్పందించకుండా మౌనంగా ఉంటూ వచ్చారు. కిడారిని హత్య చేయడానికి ముందు అతడు పార్టీ మారిన సమయంలో ఎంత డబ్బు తీసుకున్నది ఆరా తీశారని ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పారు. మావోయిస్టుల టార్గెట్‌లో మరో ఫిరాయింపు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కూడా ఉన్నారని తెలుసుకున్న పోలీసులు ఆమెకు భద్రతను కట్టుదిట్టం చేశారు.

అయితే దాడి చేసిన ఇన్నాళ్లకు మావోయిస్టు సెంట్రల్ కమిటీ ఒక లేఖను విడుదల చేసింది. ఈ లేఖలోని అంశాలు అధికార పార్టీ నేతలను మరింత భయపెట్టేలా ఉన్నాయి. ముఖ్యంగా గిడ్డి ఈశ్వరి వ్యవహారాన్ని మావోయిస్టులు ఈ లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. బాక్సైట్ తవ్వకాలకు ఎవరు అనుకూలంగా పనిచేసినా వారిని వదిలిపెట్టబోమని లేఖలో హెచ్చరించారు.

గిడ్డి ఈశ్వరి 20 కోట్లకు అమ్ముడుపోయి టీడీపీలో చేరారని మావోయిస్టులు లేఖలో వెల్లడించారు. పార్టీ మారినప్పుడు తీసుకున్న సొమ్మును, అవినీతి చేసి సంపాదించిన డబ్బును రెండు నెలల్లోగా గిరిజనులకు పంచి క్షమాపణ చెప్పాలని గిడ్డి ఈశ్వరికి మావోయిస్టులు అల్టిమేటం జారీ చేశారు. లేకుంటే కిడారి సర్వేశ్వరరావుకు పట్టిన గతే పడుతుందని మావోయిస్టులు లేఖలో హెచ్చరించారు. వెంటనే గిడ్డి ఈశ్వరి పద్దతి మార్చుకోవాలని సూచించారు.

గూడ క్వారీ విషయంలో ఎన్నోసార్లు కిడారిని హెచ్చరించామని…. కానీ కిడారి తీరు మారలేదన్నారు. మావోయిస్టు సెంట్రల్ కమిటీ పేరుతో వచ్చిన ఈ లేఖపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

First Published:  9 Oct 2018 11:59 AM GMT
Next Story