Telugu Global
National

2014లో తప్పుడు హామీలిచ్చి గెలిచాం: బీజేపీ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మోడీ ప్రభుత్వ గుట్టును విప్పారు. బీజేపీ అధికారంలోకి రావడానికి ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చిందని…. ఆ హామీలతో ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించామని…. వాటిని నెరవేర్చే ప్రయత్నం మాత్రం జరగడం లేదని నితిన్ గడ్కరీ బాంబు పేల్చారు. అధికారం కోసం తాము ఇచ్చిన హామీలను ఇప్పుడు ప్రజలు నిలదీస్తున్నారని వాపోయారు. ప్రముఖ కలర్స్ చానెల్ లో ప్రసారమైన ‘అసల్ పవానే-ఇర్సల్ నమూనే’ అనే రియాలిటీ […]

2014లో తప్పుడు హామీలిచ్చి గెలిచాం: బీజేపీ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
X

కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మోడీ ప్రభుత్వ గుట్టును విప్పారు. బీజేపీ అధికారంలోకి రావడానికి ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చిందని…. ఆ హామీలతో ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించామని…. వాటిని నెరవేర్చే ప్రయత్నం మాత్రం జరగడం లేదని నితిన్ గడ్కరీ బాంబు పేల్చారు. అధికారం కోసం తాము ఇచ్చిన హామీలను ఇప్పుడు ప్రజలు నిలదీస్తున్నారని వాపోయారు.

ప్రముఖ కలర్స్ చానెల్ లో ప్రసారమైన ‘అసల్ పవానే-ఇర్సల్ నమూనే’ అనే రియాలిటీ షోలో గడ్కరీ, ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ తో కలిసి పాల్గొన్నారు. ఇందులో నానా పటేకర్ తో మాట్లాడుతూ…. గడ్కరీ బీజేపీని తీవ్ర ఇరకాటంలో పడేసే మాటలు మాట్లాడారు.

నితిన్ గడ్కరీ మాట్లాడుతూ… ‘ప్రజలు మేం ఇచ్చిన హామీలను గుర్తు చేస్తున్నారు. మేం నవ్వి వెళ్లిపోతున్నాం. మేం అధికారంలోకి వస్తామన్న నమ్మకం లేదు. అందుకే అప్పుడు పెద్ద పెద్ద హామీలు ఇవ్వాలని మాకు సలహా ఇచ్చారు. అలా ఇచ్చి ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాం’ అని వాపోయారు. అధికారంలోకి రాకపోతే ఆ హామీలకు విలువ ఉండదు కదా అని ఏడాపెడా ఇచ్చేశామని…. కానీ ప్రజలు తమకు అధికారం కట్టబెట్టడంతోనే ఇరుకున పడ్డామని నితిన్ గడ్కరీ సరదాగా వ్యాఖ్యానించారు.

ఇది దేశవ్యాప్తంగా దుమారం రేగడంతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ…. తాజాగా నితిన్ గడ్కరీ వీడియోను ట్విట్టర్ లో పొస్ట్ చేశారు. ‘నితిన్ గడ్కరీ నిజం చెప్పారు. బీజేపీ అధికారంలోకి రావడం కోసం తమ కలల్ని, నమ్మకాన్ని వాడుకుందని ప్రజలు కూడా భావిస్తున్నారు’ అని రాహుల్ ట్వీట్ తో ఎండగట్టారు.

First Published:  9 Oct 2018 11:30 PM GMT
Next Story