Telugu Global
NEWS

కాంగ్రెస్‌లో రేవంత్‌ రెడ్డి సీట్ల చిచ్చు.... తేల్చుకోవడానికి ఢిల్లీకి?

తెలంగాణ కాంగ్రెస్‌లో సీట్ల పంచాయతీ మొదలైంది. ఎవరికి వారే తమకు, తమ వారికి సీట్లు కావాలని పట్టుబడుతున్నారు. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెడ్డి దూకుడు ఈ విషయంలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రేవంత్ రెడ్డి ఏకంగా 14 సీట్లు డిమాండ్ చేస్తున్నారు. తనతో పాటు 20 మంది పార్టీలో చేరారని…. వారిలో 14 మందికి అసెంబ్లీ టికెట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. చేరిక సమయంలో కాంగ్రెస్ నాయకత్వం కూడా ఆమేరకు తనకు హామీ ఇచ్చిందని రేవంత్ రెడ్డి […]

కాంగ్రెస్‌లో రేవంత్‌ రెడ్డి సీట్ల చిచ్చు.... తేల్చుకోవడానికి ఢిల్లీకి?
X

తెలంగాణ కాంగ్రెస్‌లో సీట్ల పంచాయతీ మొదలైంది. ఎవరికి వారే తమకు, తమ వారికి సీట్లు కావాలని పట్టుబడుతున్నారు. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెడ్డి దూకుడు ఈ విషయంలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

రేవంత్ రెడ్డి ఏకంగా 14 సీట్లు డిమాండ్ చేస్తున్నారు. తనతో పాటు 20 మంది పార్టీలో చేరారని…. వారిలో 14 మందికి అసెంబ్లీ టికెట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. చేరిక సమయంలో కాంగ్రెస్ నాయకత్వం కూడా ఆమేరకు తనకు హామీ ఇచ్చిందని రేవంత్ రెడ్డి చెబుతున్నారు.

అయితే టీపీసీసీ మాత్రం రేవంత్‌ రెడ్డి వర్గానికి ఐదు సీట్లు మాత్రమే ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. దీంతో రేవంత్ రెడ్డి చిటపటలాడుతున్నారు. తానే ఢిల్లీలోనే ఈ అంశంపై తేల్చుకుంటానంటూ ఢిల్లీకి పయనమైనట్టు చెబుతున్నారు. కాంగ్రెస్‌లో పూర్వకాలం నుంచి ఉన్న వారే ఒకటి రెండు సీట్లు ఇస్తే చాలని ఆశపడుతుంటే నిన్నలేక మొన్న పార్టీలోకి వచ్చిన రేవంత్‌ రెడ్డి ఇలా ఏకంగా 14 సీట్లు డిమాండ్ చేయడంపై కాంగ్రెస్‌ నేతలే ఆశ్చర్యపోతున్నారు.

First Published:  9 Oct 2018 11:43 PM GMT
Next Story