Telugu Global
NEWS

నాగం జ‌నార్దన్‌రెడ్డి ఇంట విషాదం

మాజీమంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. నాగం త‌న‌యుడు దిన‌క‌ర్‌రెడ్డి మృతిచెందారు. కొంత‌కాలంగా ఆయ‌న అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. గురువారం సాయంత్రం ఆరోగ్యం విష‌మించ‌డంతో ఆయన చ‌నిపోయిన‌ట్లు అపోలో ఆసుప‌త్రి వైద్యులు తెలిపారు. నాగంకు ఇద్ద‌రు కుమారులు. పెద్ద‌కొడుకు దిన‌కర్‌రెడ్డి. చిన్న‌కొడుకు శ‌శిధ‌ర్‌రెడ్డి. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న దినకర్‌రెడ్డి అక్టోబర్ 4న ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయ‌న ఆసుప‌త్రిలోనే ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. చివ‌ర‌కు ప‌రిస్థితి చేయిదాట‌డంతో ఆయ‌న చ‌నిపోయారు. దిన‌క‌ర్‌రెడ్డి మృతితో నాగం కుటుంబం […]

నాగం జ‌నార్దన్‌రెడ్డి ఇంట విషాదం
X

మాజీమంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. నాగం త‌న‌యుడు దిన‌క‌ర్‌రెడ్డి మృతిచెందారు. కొంత‌కాలంగా ఆయ‌న అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. గురువారం సాయంత్రం ఆరోగ్యం విష‌మించ‌డంతో ఆయన చ‌నిపోయిన‌ట్లు అపోలో ఆసుప‌త్రి వైద్యులు తెలిపారు. నాగంకు ఇద్ద‌రు కుమారులు. పెద్ద‌కొడుకు దిన‌కర్‌రెడ్డి. చిన్న‌కొడుకు శ‌శిధ‌ర్‌రెడ్డి.

ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న దినకర్‌రెడ్డి అక్టోబర్ 4న ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయ‌న ఆసుప‌త్రిలోనే ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. చివ‌ర‌కు ప‌రిస్థితి చేయిదాట‌డంతో ఆయ‌న చ‌నిపోయారు. దిన‌క‌ర్‌రెడ్డి మృతితో నాగం కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

గ‌త ఎన్నిక‌ల్లో నాగం జ‌నార్ధ‌న్‌రెడ్డి బీజేపీ త‌ర‌పున మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎంపీగా పోటీ చేశారు. అప్పుడు చిన్నకొడుకు శ‌శిధ‌ర్‌రెడ్డి నాగ‌ర్‌క‌ర్నూలు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. టీఆర్ఎస్ అభ్య‌ర్థి మ‌ర్రి జ‌నార్ధ‌న్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు చ‌నిపోయిన దిన‌క‌ర్‌రెడ్డి రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు.

First Published:  11 Oct 2018 12:41 PM GMT
Next Story