Telugu Global
NEWS

పవన్‌ కల్యాణ్‌కు డబ్బులిస్తే చాలు....

సినీ విమర్శకుడు కత్తి మహేష్ మరోసారి జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను టార్గెట్‌ చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన మాదిగల రాజకీయ చైతన్యసభలో మాట్లాడిన కత్తి మహేష్… పవన్‌ కల్యాణ్ బీజేపీ ఏజెంట్ అని విమర్శించారు. పవన్ కల్యాణ్ స్థిరత్వం లేని మనిషి అని విమర్శించారు. తాను ఎప్పుడు ఏం చేస్తారో, ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో పవన్‌ కల్యాణ్‌కే తెలియదన్నారు. పవన్‌ కల్యాణ్‌కు డబ్బు ఇస్తే చాలని.. అలా డబ్చు ఇచ్చిన వారికి వత్తాసు […]

పవన్‌ కల్యాణ్‌కు డబ్బులిస్తే చాలు....
X

సినీ విమర్శకుడు కత్తి మహేష్ మరోసారి జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను టార్గెట్‌ చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన మాదిగల రాజకీయ చైతన్యసభలో మాట్లాడిన కత్తి మహేష్… పవన్‌ కల్యాణ్ బీజేపీ ఏజెంట్ అని విమర్శించారు.

పవన్ కల్యాణ్ స్థిరత్వం లేని మనిషి అని విమర్శించారు. తాను ఎప్పుడు ఏం చేస్తారో, ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో పవన్‌ కల్యాణ్‌కే తెలియదన్నారు. పవన్‌ కల్యాణ్‌కు డబ్బు ఇస్తే చాలని.. అలా డబ్చు ఇచ్చిన వారికి వత్తాసు పలుకుతారని ఆరోపించారు.

జనసేన బలంపైనా వ్యాఖ్యలు చేశారు. ఒక్కో నియోజకవర్గంలో 500 మంది ఓటర్లు ప్రభావితం చేసే సీన్‌ కూడా జనసేనకు, పవన్‌ కల్యాణ్‌కు లేదన్నారు కత్తి మహేష్.

First Published:  15 Oct 2018 7:20 AM GMT
Next Story