కేటీఆర్ హత్యకు రెక్కీ...
తెలంగాణ మంత్రి కేటీఆర్ను జనశక్తి టార్గెట్ చేసింది. కేటీఆర్ను హత్య చేసేందుకు జనశక్తి రెక్కీ నిర్వహించినట్టు పోలీసులు విచారణలో తేలింది. ఇటీవల సిరిసిల్ల జిల్లా తంగెళ్లపల్లి మండలం జిల్లెల్ల వల్ల పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో జనశక్తి జిల్లా కార్యదర్శి జక్కుల బాబుతో పాటు మరో మావోయిస్టు పట్టుబడ్డారు. వారిని నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నపోలీసులు విచారించారు. విచారణలో మంత్రి కేటీఆర్ను హత్యకు రెక్కీ నిర్వహించిన విషయా్ని వారు వెల్లడించారు. మంత్రి కేటీఆర్ను హత్య చేసేందుకు […]
తెలంగాణ మంత్రి కేటీఆర్ను జనశక్తి టార్గెట్ చేసింది. కేటీఆర్ను హత్య చేసేందుకు జనశక్తి రెక్కీ నిర్వహించినట్టు పోలీసులు విచారణలో తేలింది. ఇటీవల సిరిసిల్ల జిల్లా తంగెళ్లపల్లి మండలం జిల్లెల్ల వల్ల పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో జనశక్తి జిల్లా కార్యదర్శి జక్కుల బాబుతో పాటు మరో మావోయిస్టు పట్టుబడ్డారు.
వారిని నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నపోలీసులు విచారించారు. విచారణలో మంత్రి కేటీఆర్ను హత్యకు రెక్కీ నిర్వహించిన విషయా్ని వారు వెల్లడించారు.
మంత్రి కేటీఆర్ను హత్య చేసేందుకు జనశక్తి పలుమార్లు రెక్కీ నిర్వహించిందని.. ఇప్పటికీ కేటీఆర్ ప్రధాన టార్గెట్గానే ఉన్నారని వారు పోలీసులకు వివరించారు.
సిరిసిల్ల ప్రాంతంలో జనశక్తిని బలోపేతం చేసే బాధ్యతను పార్టీ తనకు అప్పగించిందని బాబు వివరించారు. కేటీఆర్పై రెక్కీకి సంబంధించి జుక్కల బాబు చెప్పిన వివరాలన్నింటిని డీజీపీకి రిపోర్ట్ చేశారు. ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ విస్రృతంగా పర్యటనలు చేసే అవకాశం ఉండడంతో ఆయనకు భద్రతను మరింత పెంచారు