Telugu Global
NEWS

పంచాయితీ ఎన్నికల్లో కూడా నెగ్గని వ్యక్తి.... దోచుకుని దాక్కొంటే పిడుగులు పడవా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి విరుచుకుపడ్డాడు. చంద్రబాబును, ఆయన తనయుడిని లక్ష్యంగా చేసుకున్నాడు. వారిపై తీవ్రంగా విరుచుకుపడ్డాడు. లోకేష్ విషయంలో వ్యంగ్యంగా స్పందించాడు. జనసేన నిర్వహించిన కవాతు సందర్భంగా పవన్ కల్యాణ్…. బాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. ముందుగా లోకేష్ ను ఉద్దేశించి ఆయన పంచాయితీ ఎన్నికల్లో కూడా నెగ్గలేదని ఎద్దేవా చేశాడు. పంచాయితీ ఎన్నికల్లో నెగ్గని లోకేష్ పంచాయితీ రాజ్ శాఖకు మంత్రి అయ్యాడని పవన్ కల్యాణ్ వ్యంగ్యంగా స్పందించాడు. ప్రత్యక్ష ఎన్నికల్లో నెగ్గలేదన్న […]

పంచాయితీ ఎన్నికల్లో కూడా నెగ్గని వ్యక్తి.... దోచుకుని దాక్కొంటే పిడుగులు పడవా?
X

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి విరుచుకుపడ్డాడు. చంద్రబాబును, ఆయన తనయుడిని లక్ష్యంగా చేసుకున్నాడు. వారిపై తీవ్రంగా విరుచుకుపడ్డాడు. లోకేష్ విషయంలో వ్యంగ్యంగా స్పందించాడు. జనసేన నిర్వహించిన కవాతు సందర్భంగా పవన్ కల్యాణ్…. బాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు.

ముందుగా లోకేష్ ను ఉద్దేశించి ఆయన పంచాయితీ ఎన్నికల్లో కూడా నెగ్గలేదని ఎద్దేవా చేశాడు. పంచాయితీ ఎన్నికల్లో నెగ్గని లోకేష్ పంచాయితీ రాజ్ శాఖకు మంత్రి అయ్యాడని పవన్ కల్యాణ్ వ్యంగ్యంగా స్పందించాడు. ప్రత్యక్ష ఎన్నికల్లో నెగ్గలేదన్న లోకేష్ వీక్ పాయింట్ పై పవన్ ఈ విధంగా స్పందించాడు. అయితే పవన్ స్పందనలోనూ కొంత విడ్డూరం ఉంది.

అదేమిటంటే.. లోకేష్ మంత్రి అయ్యింది ఇప్పుడేమీ కాదు. అప్పట్లో లోకేష్ మంత్రి పదవిని తీసుకోవడం పట్ల పవన్ ఏమీ అనలేదు. ఇప్పుడు మాత్రం ఇలా మాట్లాడుతూ ఉన్నాడు.

ఇక ఫిరాయింపులపై కూడా పవన్ స్పందించాడు. ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధులను కొంటున్నారు…. అంటూ పవన్ చంద్రబాబును విమర్శించాడు. తాను 2014లో టీడీపీకి సపోర్ట్ చేసినందుకు బహుమతిగా…. తనను, తన తల్లిని తిట్టించారని మరోసారి లోకేష్ ను విమర్శించాడు పవన్ కల్యాణ్. లోకేష్ ముఖ్యమంత్రి కావడానికి తాను తెలుగుదేశం పల్లకి మోయాలా? అని పవన్ ప్రశ్నించాడు.

ఇక ఐటీ దాడులపై కూడా పవన్ కల్యాణ్ స్పందించాడు. దోచుకుని దాక్కొంటే పిడుగులు పడవా? అని ప్రశ్నించాడు. మొత్తానికి ఈ సారి కూడా జనసేన అధినేత ప్రధానంగా టీడీపీనే లక్ష్యంగా చేసుకుని మాట్లాడాడు.

First Published:  15 Oct 2018 10:07 AM GMT
Next Story