Telugu Global
Cinema & Entertainment

చిత్రలహరి మళ్లీ మొదలైంది

ఒకప్పుడు దూరదర్శన్ లో సూపర్ హిట్ కార్యక్రమం చిత్రలహరి. ఇప్పుడు అదే పేరుతో సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా ప్రకటించాడు. ఈ రోజు సాయిధరమ్ తేజ్ పుట్టినరోజు. పైగా మంచి రోజు. అందుకే ఈరోజు చిత్రలహరి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్ చెరుకూరి నిర్మాతలుగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి కొరటాల శివ క్లాప్‌ కొట్టగా..సాయిధరమ్‌ తేజ్‌ అమ్మ విజయ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. […]

చిత్రలహరి మళ్లీ మొదలైంది
X

ఒకప్పుడు దూరదర్శన్ లో సూపర్ హిట్ కార్యక్రమం చిత్రలహరి. ఇప్పుడు అదే పేరుతో సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా ప్రకటించాడు. ఈ రోజు సాయిధరమ్ తేజ్ పుట్టినరోజు. పైగా మంచి రోజు. అందుకే ఈరోజు చిత్రలహరి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్ చెరుకూరి నిర్మాతలుగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి కొరటాల శివ క్లాప్‌ కొట్టగా..సాయిధరమ్‌ తేజ్‌ అమ్మ విజయ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు.

తేజ్ ఐ లవ్ యు తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని తేజూ స్టార్ట్ చేసిన ప్రాజెక్టు ఇది. ఈ సినిమా కోసం ఈ మెగా హీరో ప్రత్యేకంగా మేకోవర్ అయ్యాడు. నిండుగా గడ్డం పెంచి, కాస్త స్లిమ్ అయి పూజా కార్యక్రమాలకు వచ్చాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈనెల నుంచే సెట్స్ పైకి రాబోతున్న ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించనుంది. ఆమె కూడా ఓపెనింగ్ కు వచ్చింది. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు.

మైత్రీ మూవీ మేకర్స్ కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. రంగస్థలం, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చింది ఈ బ్యానర్. ఇలాంటి సంస్థలో సినిమా చేస్తే కచ్చితంగా అది తనకు ప్లస్ అవుతుందని భావిస్తున్నాడు సాయిధరమ్ తేజ్. తన వరుస ఫ్లాపులకు మైత్రీ మూవీ మేకర్స్ బ్రేక్ వేస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నాడు.

First Published:  15 Oct 2018 8:58 AM GMT
Next Story