Telugu Global
NEWS

ఆస్పత్రి నుంచి జగన్‌ డిశ్చార్జ్

విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం తర్వాత హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్‌లో చేరిన వైఎస్‌ జగన్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గాయానికి కుట్లు వేసిన వైద్యులు…. మిగిలిన పరీక్షలు నిర్వహించారు. ఎలాంటి ఇబ్బంది లేదని తేల్చారు. దీంతో జగన్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం లోటస్‌పాండ్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. విశ్రాంతి తీసుకోవాల్సిందిగా జగన్‌కు వైద్యులు సూచించారు. జగన్‌ ఇంటి వద్దకు భారీగా అభిమానులు, వైసీపీ కార్యకర్తలు, నేతలు చేరుకున్నారు. జగన్‌ను ఆయన సోదరి షర్మిల […]

ఆస్పత్రి నుంచి జగన్‌ డిశ్చార్జ్
X

విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం తర్వాత హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్‌లో చేరిన వైఎస్‌ జగన్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గాయానికి కుట్లు వేసిన వైద్యులు…. మిగిలిన పరీక్షలు నిర్వహించారు. ఎలాంటి ఇబ్బంది లేదని తేల్చారు. దీంతో జగన్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

అనంతరం లోటస్‌పాండ్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. విశ్రాంతి తీసుకోవాల్సిందిగా జగన్‌కు వైద్యులు సూచించారు. జగన్‌ ఇంటి వద్దకు భారీగా అభిమానులు, వైసీపీ కార్యకర్తలు, నేతలు చేరుకున్నారు. జగన్‌ను ఆయన సోదరి షర్మిల పరామర్శించారు.

First Published:  26 Oct 2018 2:42 AM GMT
Next Story