Telugu Global
International

మనిషి రక్తం తాగి, మాంసం తినాలనుకున్నారు... కానీ....

ఎప్పుడో ఆటవిక రాజ్యంలో మనిషి బతకడం కోసం జంతువులను వేటాడి వాటిని చంపి తినేవాడు. అంతకుముందు మనుషులను కూడా తినేవాడని విన్నాం. కానీ నేటి ఆధునిక సమాజంలో అలాంటివేమీ లేవు. కానీ మనుషుల రక్తం తాగాలని ఇక్కడ ప్లాన్ చేశారు. సొంత స్నేహితుల రక్తం తాగడానికే కుట్ర పన్నారు. ఈ కుట్రను అమెరికా పోలీసులు చేధించారు. ఒళ్లు గగొరుపొడిచే ఆ సంఘటన మధ్య ఫ్లోరిడాలో చోటుచేసుకుంది. మధ్య ఫ్లోరిడాలోని ఓ స్కూల్ లో ఇద్దరు బాలికలకు నిండా […]

మనిషి రక్తం తాగి, మాంసం తినాలనుకున్నారు... కానీ....
X

ఎప్పుడో ఆటవిక రాజ్యంలో మనిషి బతకడం కోసం జంతువులను వేటాడి వాటిని చంపి తినేవాడు. అంతకుముందు మనుషులను కూడా తినేవాడని విన్నాం. కానీ నేటి ఆధునిక సమాజంలో అలాంటివేమీ లేవు. కానీ మనుషుల రక్తం తాగాలని ఇక్కడ ప్లాన్ చేశారు. సొంత స్నేహితుల రక్తం తాగడానికే కుట్ర పన్నారు. ఈ కుట్రను అమెరికా పోలీసులు చేధించారు. ఒళ్లు గగొరుపొడిచే ఆ సంఘటన మధ్య ఫ్లోరిడాలో చోటుచేసుకుంది.

మధ్య ఫ్లోరిడాలోని ఓ స్కూల్ లో ఇద్దరు బాలికలకు నిండా 11, 12 ఏళ్ల వయసు కూడా లేదు. వారు తమ క్లాస్ మేట్స్ రక్తం తాగి…. ఆ తర్వాత వారి మాంసాన్ని కూడా తినాలనే ప్లాన్ చేశారు. స్నేహితులను కత్తులతో చంపేందుకు స్కూల్ వాష్ రూంలో దాక్కొని ఉన్నారు.

అదే సమయంలో స్కూల్ ఫంక్షన్ జరుగుతోంది. దీంతో ఆ హాడావుడిలో తమను ఎవరూ గుర్తించరని బాలికలు ప్లాన్ చేశారు. అయితే బాత్ రూంలో దాక్కున్న బాలికలను ఓ విద్యార్థి తండ్రి చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఈ కుట్రను భగ్నం చేశారు. కత్తులతో చంపేందుకు రెడీగా ఉన్న వారిని పట్టుకొని అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు.

పోలీసుల విచారణలో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. వీరిద్దరు మంత్రతంత్రాలకు బానిసై…. సైతాన్ ఆరాధకులుగా మారారని తేలింది. మనుషులను చంపి రక్తం తాగి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారని పోలీసులు తెలిపారు.

First Published:  26 Oct 2018 7:35 PM GMT
Next Story