Telugu Global
Cinema & Entertainment

పంది అందర్నీ తృప్తిపరుస్తుంది

నిర్మాత సురేష్ బాబు అండతో ఎట్టకేలకు తన పందిని వెలుగులోకి తీసుకురాగలిగాడు రవిబాబు. పంది పిల్లను లీడ్ రోల్ లో పెట్టి అదుగో అనే సినిమా తీశాడు ఈ దర్శకుడు కమ్ నిర్మాత. తన సొంత బ్యానర్ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ పై డబ్బు ఖర్చుపెట్టి మరీ ఈ సినిమా తీసాడు. బయ్యర్లు లేక అవస్థలు పడుతుంటే సురేష్ బాబు రిలీజ్ చేయడానికి అంగీకరించారు. అలా ఈ దీపావళికి థియేటర్లలోకి రాబోతున్న అదుగో సినిమాకు సంబంధించి వినూత్నంగా ప్రచారం […]

పంది అందర్నీ తృప్తిపరుస్తుంది
X

నిర్మాత సురేష్ బాబు అండతో ఎట్టకేలకు తన పందిని వెలుగులోకి తీసుకురాగలిగాడు రవిబాబు. పంది పిల్లను లీడ్ రోల్ లో పెట్టి అదుగో అనే సినిమా తీశాడు ఈ దర్శకుడు కమ్ నిర్మాత. తన సొంత బ్యానర్ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ పై డబ్బు ఖర్చుపెట్టి మరీ ఈ సినిమా తీసాడు. బయ్యర్లు లేక అవస్థలు పడుతుంటే సురేష్ బాబు రిలీజ్ చేయడానికి అంగీకరించారు.

అలా ఈ దీపావళికి థియేటర్లలోకి రాబోతున్న అదుగో సినిమాకు సంబంధించి వినూత్నంగా ప్రచారం షురూ చేశాడు రవిబాబు. బంటీ అనే ఈ పందిపిల్లతో పాదయాత్ర చేశాడు. అవును.. కేబీఆర్ పార్క్ నుంచి ఫిలింనగర్ వరకు పందిపిల్లతో పాదయాత్ర చేసి అందర్నీ ఎట్రాక్ట్ చేశాడు. ఈ పాదయాత్రలో యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు.

పాదయాత్ర అనంతరం ప్రెస్ మీట్ కూడా పెట్టాడు రవిబాబు. మా పందిపిల్ల అందర్నీ తృప్తి పరుస్తుందని, కచ్చితంగా సినిమా అందర్నీ అలరిస్తుందని చెబుతున్నాడు. ఈమధ్య సుధీర్ బాబు సరసన నన్ను దోచుకుందువటే అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన నభా నటేష్ గుర్తుందా..! ఆమె మొదటి సినిమా ఈ పందిపిల్ల మూవీనే. అన్నీ అనుకున్నట్టు జరిగితే అదుగో సినిమాతో ఆమె ఎంట్రీ ఇవ్వాల్సింది. ఇప్పుడు ఇది ఆమె కెరీర్ లో రెండో తెలుగు సినిమాగా మారిందన్నమాట.

First Published:  3 Nov 2018 8:32 AM GMT
Next Story