Telugu Global
National

ఉపఎన్నికల ఫలితాలు.... బీజేపీకి ఝలక్!

కర్ణాటకలో వివిధ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి షాక్ తగిలింది. తమ పార్టీ సిట్టింగు స్థానాన్ని బీజేపీ కోల్పోయింది. ఈ సీటును తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి అప్పగించింది కమలం పార్టీ. ఈ విధంగా ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కు కలిసి వచ్చింది. బీజేపీకి దెబ్బ పడింది. ప్రత్యేకించి బళ్లారి ఎంపీ సీటును బీజేపీ కోల్పోవడం ఒకింత సంచలనంగా మారింది. ఈ సీట్లో చాలా సంవత్సరాలుగా బీజేపీ, శ్రీరాములు ఆధిపత్యం కొనసాగుతూ […]

ఉపఎన్నికల ఫలితాలు.... బీజేపీకి ఝలక్!
X

కర్ణాటకలో వివిధ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి షాక్ తగిలింది. తమ పార్టీ సిట్టింగు స్థానాన్ని బీజేపీ కోల్పోయింది. ఈ సీటును తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి అప్పగించింది కమలం పార్టీ. ఈ విధంగా ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కు కలిసి వచ్చింది. బీజేపీకి దెబ్బ పడింది.

ప్రత్యేకించి బళ్లారి ఎంపీ సీటును బీజేపీ కోల్పోవడం ఒకింత సంచలనంగా మారింది. ఈ సీట్లో చాలా సంవత్సరాలుగా బీజేపీ, శ్రీరాములు ఆధిపత్యం కొనసాగుతూ వచ్చింది. అయితే ఈ సారి దానికి గండి పడింది.

ఇక బళ్లారితో పాటు మరి కొన్ని సీట్లకు కూడా కర్ణాటకలో ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు కూడా వెల్లడి అయ్యాయి. ఆ విషయంలో కూడా కాంగ్రెస్, జేడీఎస్ ల కూటమి పై చేయి సాధించడం విశేషం.

మండ్యా ఎంపీ సీటును జేడీఎస్ నిలబెట్టుకుంది. అలాగే… కుమారస్వామి భార్య అనితా కుమారస్వామి రామనగర నుంచి ఎమ్మెల్యేగా నెగ్గింది. జమఖండి అసెంబ్లీ సీటు నుంచి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.

భారతీయ జనతా పార్టీకి దక్కిన ఊరట …. శివమొగ్గ ఎంపీ సీటును నెగ్గడం. అక్కడ నుంచి యడ్యూరప్ప తనయుడు ఎంపీగా విజయం సాధించాడు. ఈ ఒక్క టే కర్ణాటక ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి దక్కిన ఊరట!

First Published:  6 Nov 2018 2:45 AM GMT
Next Story