Telugu Global
Cinema & Entertainment

"సాహో" ఆఖరి ఘట్టం ప్రారంభం

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం “సాహో”. ఈ చిత్రం గురించి ప్రేక్షకులతో పాటు యావత్ పరిశ్రమ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించే ప్రతిష్టత్మక చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.  ఇటీవలే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ అభిమానులని ఆనందపరచడమే కాకుండా తమ అంచనాలను కూడా పెంచేసింది. ఈ చిత్రంలో కథానాయికగా హిందీ భామ శ్రద్ధ కపూర్, కండల వీరుడు నీల్ […]

సాహో ఆఖరి ఘట్టం ప్రారంభం
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం “సాహో”. ఈ చిత్రం గురించి ప్రేక్షకులతో పాటు యావత్ పరిశ్రమ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించే ప్రతిష్టత్మక చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇటీవలే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ అభిమానులని ఆనందపరచడమే కాకుండా తమ అంచనాలను కూడా పెంచేసింది.

ఈ చిత్రంలో కథానాయికగా హిందీ భామ శ్రద్ధ కపూర్, కండల వీరుడు నీల్ నితిన్ ముఖేష్ ప్రతినాయక పాత్రలో నటించారు.ఈ చిత్రం కోసం మరో భారీ పోరాట ఘట్టాన్ని చిత్రీకరించబోతున్నారు. ప్రభాస్ – నీల్ నితిన్ ముఖేష్ మధ్య సాగే ఈ పోరాటం ఎంతో ఉత్కంఠభరితంగా మరియు రక్తికట్టించేలా ఉండబోతుంది అని తాజా సమాచారం. ఇందుకోసం పాత్రధారుల కసరత్తులతో పాటు, పోరాట దర్శకుడు కెన్ని బేట్స్ మరింత శ్రద్దగా , గొప్పగా చిత్రీకరించబోతున్నట్టుగా తెలుస్తుంది.

300 కోట్ల పైమాట గా తెర్కక్కిస్తున్న ఈ చిత్రానికి ‘రన్ రాజ రన్’ చిత్ర దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహించగా, ఉప్పలపాటి ప్రమోద్, వంశీ కృష్ణ నిర్మతలగా వ్యవహరిస్తున్నారు. జాకి ష్రాఫ్, అరుణ్ విజయ్, మహేష్ మంజ్రేకర్, చుంకే పండే వంటి దిగ్గజాలు కూడా ఈ చిత్రం లో నటించారు. శంకర్ – ఎహసాన్ – లాయ్ త్రయం సంగీతాన్ని సమకూర్చగా, మాది ఛాయాగ్రాహకుడిగా పని చేస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, మలయాళం భాషల్లో విడుదల కాబోతుంది.

First Published:  10 Nov 2018 12:20 PM GMT
Next Story