Telugu Global
Cinema & Entertainment

సాయి పల్లవితో వరుణ్ తేజ్ పోటీ ?

గత ఏడాది “ఫిదా” సినిమాతో వరుణ్ తేజ్, సాయి పల్లవి ఇద్దరు తమ కెరీర్ బెస్ట్ సినిమాని అందుకున్నారు. ఆ సినిమా తరువాత సాయి పల్లవి ఇంకా వరుణ్ తేజ్ విడివిడిగా తమ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న “అంతరిక్షం” సినిమాలో నటిస్తున్నాడు. పూర్తీ స్థాయి స్పేస్ ఫిలిం గా రాబోతున్న ఈ సినిమా డిసెంబర్ 21 న రిలీజ్ అవుతుంది. అదే రోజు శర్వానంద్ హీరోగా […]

సాయి పల్లవితో వరుణ్ తేజ్ పోటీ ?
X

గత ఏడాది “ఫిదా” సినిమాతో వరుణ్ తేజ్, సాయి పల్లవి ఇద్దరు తమ కెరీర్ బెస్ట్ సినిమాని అందుకున్నారు. ఆ సినిమా తరువాత సాయి పల్లవి ఇంకా వరుణ్ తేజ్ విడివిడిగా తమ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న “అంతరిక్షం” సినిమాలో నటిస్తున్నాడు. పూర్తీ స్థాయి స్పేస్ ఫిలిం గా రాబోతున్న ఈ సినిమా డిసెంబర్ 21 న రిలీజ్ అవుతుంది. అదే రోజు శర్వానంద్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వస్తున్న “పడి పది లేచే మనసు” సినిమా కూడా రిలీజ్ అవుతుంది అని ఈ సినిమా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

ఇదిలా ఉంటే సాయి పల్లవికి తెలుగు లో మంచి క్రేజ్ ఉంది. మరి సాయి పల్లవి క్రేజ్ ని తట్టుకొని వరుణ్ తేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడగలడ అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు ఫిలిం నగర్ జనాలు. అయితే “పడి పడి లేచే మనసు” సినిమా పోస్ట్ పోన్ అవుతుంది అనుకోని వరుణ్ తేజ్ తన సినిమా రిలీజ్ ని ప్రకటించాడు కానీ ఇప్పుడు ఆ సినిమా కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి అందరి ద్రుష్టి ఇప్పుడు ఈ రెండు సినిమాలపై పడింది. మరి ఈ బాక్స్ ఆఫీస్ పోరులో ఎవరు గెలుస్తారు అనేది తెలియాలి అంటే డిసెంబర్ 21 వరకు ఆగాల్సిందే.

First Published:  10 Nov 2018 1:29 AM GMT
Next Story