Telugu Global
NEWS

విండీస్ తో టీ-20 సిరీస్ లో నేడే ఆఖరాట

చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ కుల్దీప్, ఉమేశ్, బుమ్రాలకు రెస్ట్, అయ్యర్,సుందర్ లకు చాన్స్ సిరీస్ స్వీప్ కు టీమిండియా తహతహ టీమిండియా- విండీస్ జట్ల తీన్మార్ టీ-20 షో ముగింపు దశకు చేరింది. ఇప్పటికే మొదటి రెండు మ్యాచ్ లు నెగ్గడం ద్వారా… 2-0తో సిరీస్ ఖాయం చేసుకొన్న ఆతిథ్య టీమిండియా… ఈ ఆఖరాటలో మాత్రం పలువురు రిజర్వ్ ఆటగాళ్లకు తుదిజట్టులో చోటు కల్పించాలని నిర్ణయించింది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా రాత్రి […]

విండీస్ తో టీ-20 సిరీస్ లో నేడే ఆఖరాట
X
  • చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్
  • కుల్దీప్, ఉమేశ్, బుమ్రాలకు రెస్ట్, అయ్యర్,సుందర్ లకు చాన్స్
  • సిరీస్ స్వీప్ కు టీమిండియా తహతహ

టీమిండియా- విండీస్ జట్ల తీన్మార్ టీ-20 షో ముగింపు దశకు చేరింది. ఇప్పటికే మొదటి రెండు మ్యాచ్ లు నెగ్గడం ద్వారా… 2-0తో సిరీస్ ఖాయం చేసుకొన్న ఆతిథ్య టీమిండియా… ఈ ఆఖరాటలో మాత్రం పలువురు రిజర్వ్ ఆటగాళ్లకు తుదిజట్టులో చోటు కల్పించాలని నిర్ణయించింది.

చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ లో సైతం..టీమిండియానే హాట్ ఫేవరెట్ గా పోటీకి దిగుతోంది. స్టార్ బౌలర్ల త్రయం కుల్దీప్ యాదవ్, ఉమేశ్ యాదవ్, జస్ ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతి ఇచ్చి… శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్ లకు చోటు కల్పించే అవకాశం ఉంది.

విండీస్ తో ఇప్పటి వరకూ ఆడిన మొత్తం పది టీ-20ల్లో నాలుగు విజయాలు సాధించిన టీమిండియా…ఆఖరి మ్యాచ్ లో సైతం నెగ్గి 5-5తో సమఉజ్జీగా నిలవాలన్న పట్టుదలతో ఉంది. బ్యాటింగ్ స్వర్గధామం లాంటి చెపాక్ పిచ్ పైన పరుగుల మోత మోగే అవకాశం లేకపోలేదు. ఈమ్యాచ్ తో భారత్ లో విండీస్ ఆరువారాల పర్యటనకు తెరపడనుంది.

First Published:  10 Nov 2018 7:02 PM GMT
Next Story