Telugu Global
Cinema & Entertainment

పారితోషకం తీసుకోకుండా సినిమా చేస్తున్న శ్రీనువైట్ల

ఫ్లాప్స్ లో ఉన్న శ్రీనువైట్ల నుంచి వస్తున్న లేటెస్ట్ సినిమా “అమర్ అక్బర్ అంటోనీ”. అయితే ఈ సినిమా డైరెక్ట్ చేయడం కోసం నిర్మాతల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట శ్రీనువైట్ల. కేవలం సినిమా సక్సెస్ అయితే నిర్మాతల నుంచి లాభాల్లో షేర్ తీసుకుంటాడట. భారీ బడ్జెట్ తో నిర్మాణం జరిగిన ఈ సినిమా సక్సెస్ అవ్వడం పక్కన పెడితే లాభాలను దక్కించుకోవడం అనేది కష్టమైనా విషయమని అయినా కూడా శ్రీనువైట్ల చాలా నమ్మకంతో రిస్క్ […]

పారితోషకం తీసుకోకుండా సినిమా చేస్తున్న శ్రీనువైట్ల
X

ఫ్లాప్స్ లో ఉన్న శ్రీనువైట్ల నుంచి వస్తున్న లేటెస్ట్ సినిమా “అమర్ అక్బర్ అంటోనీ”. అయితే ఈ సినిమా డైరెక్ట్ చేయడం కోసం నిర్మాతల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట శ్రీనువైట్ల. కేవలం సినిమా సక్సెస్ అయితే నిర్మాతల నుంచి లాభాల్లో షేర్ తీసుకుంటాడట. భారీ బడ్జెట్ తో నిర్మాణం జరిగిన ఈ సినిమా సక్సెస్ అవ్వడం పక్కన పెడితే లాభాలను దక్కించుకోవడం అనేది కష్టమైనా విషయమని అయినా కూడా శ్రీనువైట్ల చాలా నమ్మకంతో రిస్క్ చేసి మరి ఈ సినిమాని చేయడం జరిగింది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రవితేజ ఇంకా శ్రీనువైట్లకు ఈ సినిమా సక్సెస్ చాలా అవసరం. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా మళ్ళి తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా నవంబర్ 16 న గ్రాండ్ రిలీజ్ కానుంది. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కించారు.

First Published:  11 Nov 2018 11:27 PM GMT
Next Story