Telugu Global
NEWS

వారి చేరిక.... ఫలించిన మిథున్ రెడ్డి మంత్రాంగం!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతూ ఉన్నాయి. జగన్ పాదయాత్ర పునఃప్రారంభం అయిన నేపథ్యంలో పలువురు నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో చిత్తూరు జిల్లా తంబళ్ళ పల్లె నియోజకవర్గం నేతలు ఉండటం విశేషం. తంబళ్ళ పల్లె నియోజకవర్గానికి చెందిన ఎంపీపీ కొండా గీతమ్మ, ఆమె తనయుడు కొండా సిద్ధార్థ్ , సింగిల్ విండో ప్రెసి డెంట్ భాస్కర్ రెడ్డి తదితరులు వైసీపీలోకి చేరారు. ఇక్కడ విశేషం ఏమిటంటే.. కొండా గీతమ్మను చేర్చుకోవడానికి వైసీపీ బాగా ఆసక్తి […]

వారి చేరిక.... ఫలించిన మిథున్ రెడ్డి మంత్రాంగం!
X

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతూ ఉన్నాయి. జగన్ పాదయాత్ర పునఃప్రారంభం అయిన నేపథ్యంలో పలువురు నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో చిత్తూరు జిల్లా తంబళ్ళ పల్లె నియోజకవర్గం నేతలు ఉండటం విశేషం.

తంబళ్ళ పల్లె నియోజకవర్గానికి చెందిన ఎంపీపీ కొండా గీతమ్మ, ఆమె తనయుడు కొండా సిద్ధార్థ్ , సింగిల్ విండో ప్రెసి డెంట్ భాస్కర్ రెడ్డి తదితరులు వైసీపీలోకి చేరారు.

ఇక్కడ విశేషం ఏమిటంటే.. కొండా గీతమ్మను చేర్చుకోవడానికి వైసీపీ బాగా ఆసక్తి చూపించింది. ఇటీవలే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ప్రత్యేకంగా వారితో సమావేశం అయ్యాడు. కొండా గీతమ్మ, సిద్ధార్థ్ లను వైసీపీలోకి చేర్చుకోవడానికి మిథున్ రెడ్డి స్వయంగా వారి ఇంటికి వెళ్లాడు.

చర్చలు జరిపి వారిని పార్టీలోకి ఆహ్వానించాడు మిథున్ రెడ్డి. వారిని ప్రత్యేకంగా పాదయాత్ర లో ఉన్న జగన్ వద్దకు తీసుకెళ్లి వైసీపీ తీర్థం ఇచ్చారు.
ప్రత్యేకించి మిథున్ రెడ్డి వీరి చేరిక విషయంలో చాలా చొరవ చూపాడు.

చిత్తూరు జిల్లాలో వైసీపీకి మంచి పట్టు ఉంది. అయితే ఏ మాత్రం పట్టు వీడకుండా పెద్దిరెడ్డి కుటుంబం ఇక్కడ తమ చొరవను కొనసాగిస్తూ ఉంది. పార్టీ బలంగా ఉందని…. ఖాళీగా కూర్చోకుండా చేరడానికి వచ్చేవాళ్లను చేర్చుకొంటూ పెద్దిరెడ్డి కుటుంబం పార్టీని పటిష్టం చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉంది. మిగతా వాళ్లు ఈ అంశాన్ని గుర్తిస్తే వైసీపీకి తిరుగు ఉండకపోవచ్చు.

First Published:  13 Nov 2018 2:21 AM GMT
Next Story