Telugu Global
International

పాక్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ షాక్

బీసీసీఐతో న్యాయపోరాటంలో ఓడిన పీసీబీ భారత్ పై 447 కోట్ల నష్టపరిహారం దావా భారత క్రికెట్ బోర్డుతో జరిపిన న్యాయపోరాటంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఘోరపరాజయం చవిచూసింది. 2015 నుంచి భారత క్రికెట్ జట్టు తమ దేశపర్యటనకు దూరంగా ఉన్న కారణంగా.. తమకు కలిగిన నష్టం కోసం….అంతర్జాతీయ క్రికెట్ మండలి కోర్టును పీసీబీ ఆశ్రయించింది. తమ క్రికెట్ బోర్డుకు జరిగిన నష్టానికి గాను 447 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ… దావా వేసింది.  ఈ కేసును సమగ్రంగా విచారించిన ఐసీసీ వివాదాల […]

పాక్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ షాక్
X
  • బీసీసీఐతో న్యాయపోరాటంలో ఓడిన పీసీబీ
  • భారత్ పై 447 కోట్ల నష్టపరిహారం దావా

భారత క్రికెట్ బోర్డుతో జరిపిన న్యాయపోరాటంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఘోరపరాజయం చవిచూసింది. 2015 నుంచి భారత క్రికెట్ జట్టు తమ దేశపర్యటనకు దూరంగా ఉన్న కారణంగా.. తమకు కలిగిన నష్టం కోసం….అంతర్జాతీయ క్రికెట్ మండలి కోర్టును పీసీబీ ఆశ్రయించింది. తమ క్రికెట్ బోర్డుకు జరిగిన నష్టానికి గాను 447 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ… దావా వేసింది.

ఈ కేసును సమగ్రంగా విచారించిన ఐసీసీ వివాదాల కమిటీ… చివరకు భారత క్రికెట్ బోర్డుకు అనుకూలంగా తీర్పును ఇచ్చింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుతో బీసీసీఐ ఎలాంటి ఒప్పందమూ చేసుకోలేదని… మాటగా అనుకొన్నది ఒప్పందం కాబోదని తేల్చి చెప్పింది.

దీంతో… పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నుంచి… తమ కోర్టు ఖర్చులను రాబట్టాలని బీసీసీఐ నిర్ణయించింది.

First Published:  20 Nov 2018 8:55 AM GMT
Next Story