Telugu Global
Cinema & Entertainment

చిత్ర‌ల‌హ‌రి కూడా మొదలైంది

ఈరోజు ఎన్టీఆర్-చరణ్ ల మల్టీస్టారర్ సినిమానే కాదు, సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా కూడా మొదలైంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ సినిమా ఇవాళ్టి నుంచి సెట్స్ పైకి వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమౌతున్న ఈ సినిమాలో సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, నివేదా పేతురాజ్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను 2019 ఏప్రిల్‌లో విడుద‌ల చేయడానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ […]

చిత్ర‌ల‌హ‌రి కూడా మొదలైంది
X

ఈరోజు ఎన్టీఆర్-చరణ్ ల మల్టీస్టారర్ సినిమానే కాదు, సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా కూడా మొదలైంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ సినిమా ఇవాళ్టి నుంచి సెట్స్ పైకి వచ్చింది.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమౌతున్న ఈ సినిమాలో సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, నివేదా పేతురాజ్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను 2019 ఏప్రిల్‌లో విడుద‌ల చేయడానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ కొత్తగా కనిపిస్తాడట. అతడి హెయిర్ స్టయిల్, లుక్ కూడా విభిన్నంగా ఉంటాయని తెలుస్తోంది. ఇక కథ విషయానికొస్తే.. చిత్రలహరి అనే టైటిల్ కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉన్నప్పటికీ సినిమా మాత్రం కుటుంబకథా చిత్రమే అంటున్నాడు కిషోర్ తిరుమల.

ఈ సినిమా ఇప్పుడు అందరికీ కీలకమే. హీరో సాయిధరమ్ తేజ్, దర్శకుడు కిషోర్ తిరుమల, నిర్మాతలు, హీరోయిన్.. ఇలా అందరూ ఇప్పుడు ఫ్లాపుల్లో ఉన్నారు. వీళ్లు మళ్లీ ట్రాక్ పైకి రావాలంటే చిత్రలహరి కచ్చితంగా హిట్ అవ్వాలి. అందుకే ఈ సినిమాపై నిర్మాతలు ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

First Published:  19 Nov 2018 9:00 PM GMT
Next Story