Telugu Global
NEWS

కొత్తగూడెంలో మళ్లీ సడ్డకుల కొట్లాట.... గెలుపెవరిదో....?

మలి దశ తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నది ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే. కేసీఆర్ ను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి, జైలుకు తరలించిన దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అదే ఊపులో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ఉద్యమం ఉధృతంగా మారింది. తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యాక…. 2014లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవలం కొత్తగూడెం నియోజకవర్గంలో మాత్రమే టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్, వైసీపీ పార్టీలు ఎక్కువ మొత్తంలో సీట్లు […]

కొత్తగూడెంలో మళ్లీ సడ్డకుల కొట్లాట.... గెలుపెవరిదో....?
X

మలి దశ తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నది ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే. కేసీఆర్ ను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి, జైలుకు తరలించిన దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అదే ఊపులో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ఉద్యమం ఉధృతంగా మారింది.

తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యాక…. 2014లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవలం కొత్తగూడెం నియోజకవర్గంలో మాత్రమే టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్, వైసీపీ పార్టీలు ఎక్కువ మొత్తంలో సీట్లు సంపాదించాయి.

అయితే కొత్తగూడెంలో గత ఎన్నికల్లో గెలవడానికి టీఆర్ఎస్ పార్టీ ప్రభావం కంటే ఇద్దరు వ్యక్తులే కారణం. స్వయానా సడ్డకులు అయిన వనమా వెంకటేశ్వర రావు, యడవల్లి కృష్ణలు చీల్చిన ఓట్ల వల్లే టీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకటరావు విజయం సాధించారు.

ఈ సారి కూడా మళ్లీ గత ఎన్నికల్లో జరిగిన పరిస్థితే రిపీట్ అవుతోంది. టీఆర్ఎస్ నుంచి జలగం వెంకటరావు బరిలో ఉండగా.. చివరి క్షణం వరకు కాంగ్రెస్ టికెట్ ఆశించిన యడవల్లి కృష్ణ టికెట్ దక్కకపోవడంతో బీఎల్ఎఫ్ తరపున బరిలో దిగారు. ఇక మహాకూటమి తరపున కాంగ్రెస్ ఈ సీటును తీసుకొని వనమా వెంకటేశ్వరరావుకు ఇచ్చింది. మహా కూటమిలో భాగస్వాములైన సీపీఐ, టీడీపీకి కూడా ఈ నియోజకవర్గంపై పట్టుండటంతో చివరి వరకు ఆ సీటు కావాలనే కోరుకున్నాయి. కాని కాంగ్రెస్ ఈ సీటును తమకే కేటాయించుకుంది.

ఇక గత కొన్ని ఏండ్లుగా టీడీపీలో ఉన్న కోనేరు నాగేశ్వర రావు(మరణించారు) కుమారుడు కోనేరు సత్యనారాయణ (చిన్ని) ఈ టికెట్ ఆశించారు. అయితే పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు వెళ్లడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. వనమా, కోనేరు కుటుంబాల మధ్య గత కొన్ని ఏండ్లుగా రాజకీయ వైరం ఉంది. అయితే ఇప్పుడు మహాకూటమి వల్ల కలిసి పని చేయాల్సి రావడం చిన్ని అసంతృప్తికి కారణమైంది. కాని సోమవారం చిన్నిని టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు అమరావతి పిలిపించి బుజ్జగించడంతో ఆయన చల్లబడ్డారు.

ఇక సింగరేణి బెల్డులోని ఈ నియోజవర్గాన్ని సీపీఐ తరపున మాజీ ఎమ్మెల్యే కూనం సాంబశివరావు ఆశించారు. కాని ఇప్పుడు టీడీపీ, సీపీఐ రెండు పార్టీలు కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేసిన వనమా రెండో స్థానంలో నిలవగా.. టీడీపీ అభ్యర్థి చిన్ని మూడో స్థానంలో నిలిచారు.

దీంతో కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు ఓట్లను మహాకూటమి అభ్యర్థికే వేస్తే ఈ సారి కాంగ్రెస్ విజయం ఖాయమే. కాని గత ఎన్నికల్లో వనమ ఓటమికి కారకుడైన తోడల్లుడు యడవల్లి ఈ సారి బీఎల్ఎప్ తరపున నిలబడటంతో ఈ ఎన్నికలు మళ్లీ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

First Published:  19 Nov 2018 7:02 PM GMT
Next Story