Telugu Global
CRIME

ప్రియుడు పిలిచాడని వెళ్తే.... అత్యాచారం చేశారు....

అమ్మాయిలు చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లు వాళ్ల ప్రాణాల మీదకే తెస్తున్నాయి. వాడు అలాంటి వాడు కాదు…. అని నమ్మతూ చాలా మంది మోసపోతున్నారు. అయినా, వాళ్ళ వైఖరిలో ఎటువంటి మార్పు రాకపోవడం విచిత్రం. అలా ప్రియుడి మోసానికి బలైందో యువతి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. కలిసి తిరిగేందుకు రమ్మని పిలిచి సామూహిక అత్యాచారం చేశారు. వివరాల్లోకి వెళితే…. భద్రాద్రి కొత్తగూడెంలోని దుమ్ముగూడెంలో ఈ నెల 19న జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదే గ్రామానికి […]

ప్రియుడు పిలిచాడని వెళ్తే.... అత్యాచారం చేశారు....
X

అమ్మాయిలు చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లు వాళ్ల ప్రాణాల మీదకే తెస్తున్నాయి. వాడు అలాంటి వాడు కాదు…. అని నమ్మతూ చాలా మంది మోసపోతున్నారు. అయినా, వాళ్ళ వైఖరిలో ఎటువంటి మార్పు రాకపోవడం విచిత్రం. అలా ప్రియుడి మోసానికి బలైందో యువతి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. కలిసి తిరిగేందుకు రమ్మని పిలిచి సామూహిక అత్యాచారం చేశారు. వివరాల్లోకి వెళితే….

భద్రాద్రి కొత్తగూడెంలోని దుమ్ముగూడెంలో ఈ నెల 19న జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదే గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి, ప్రశాంత్‌ ప్రేమికుంచుకున్నారు. ఆ అమ్మాయి అతడిని బాగా నమ్మింది. త్వరంలో పెళ్లి చేసుకుందాం.. కలిసి బతుకుదాం అంటూ నమ్మబలికాడు. చివరికి అతను అంత పని చేస్తాడని ఊహించలేదు.

ప్రశాంత్‌ స్నేహితులతో కలిసి అత్యాచారం చేయాలని కుట్ర పన్నాడు. బయటకు రా.. సరదాగా గడుపుదాం అని పిలిచాడు. అప్పటికే పూర్తిగా అతడి ప్రేమలో మునిగిపోయిన ఆ యువతి వెళ్లింది. గ్రామం దగ్గరలోని వాగు ఒడ్డు వద్దకు తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ అతని స్నేహితులు నలుగురు ఉన్నారు. వెనుక నుంచి వచ్చిన వారు ఆ యువతిని గట్టిగా పట్టుకున్నారు. ఒకరి తరువాత ఒకరు అత్యాచారం చేశారు. తప్పించుకునే అవకాశం ఇవ్వలేదు వారు.

ఎలాగోలా కామాంధుల నుంచి తప్పించుకున్న ఆ యువతి గాయాలతో ఇంటికి చేరుకుంది. భయంతో ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పలేదు. ధైర్యం చేసి ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రశాంత్, మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. ప్రేమ పేరుతో తొందరపడితే ఎంతటి అనర్థాలో ఈ ఘటన రుజువు చేస్తోంది.

First Published:  22 Nov 2018 10:15 AM GMT
Next Story