Telugu Global
NEWS

చంద్రబాబు అవినీతి.... పుస్తకాన్ని గవర్నర్‌కు ఇచ్చిన కన్నా

ఆంధ్రప్రదేశ్‌ భారతీయ జనతాపార్టీ ప్రతినిధుల బృందం కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి చంద్రబాబు అవినీతి పై ప్రశ్నలతో కూర్చిన ఒక పుస్తకాన్ని అందజేశారు. గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు అవినీతి పై వారానికి ఐదు ప్రశ్నల చొప్పున సంధించాడు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన చేసిన అవినీతి, అక్రమాలపై, భూ దోపిడి పై, ఇసుక దోపిడి పై, అన్యాయపు, […]

చంద్రబాబు అవినీతి.... పుస్తకాన్ని గవర్నర్‌కు ఇచ్చిన కన్నా
X

ఆంధ్రప్రదేశ్‌ భారతీయ జనతాపార్టీ ప్రతినిధుల బృందం కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి చంద్రబాబు అవినీతి పై ప్రశ్నలతో కూర్చిన ఒక పుస్తకాన్ని అందజేశారు.

గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు అవినీతి పై
వారానికి ఐదు ప్రశ్నల చొప్పున సంధించాడు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన చేసిన అవినీతి, అక్రమాలపై, భూ దోపిడి పై, ఇసుక దోపిడి పై, అన్యాయపు, అవినీతి పాలన పై సమాధానాలు కోరుతూ ఈ ప్రశ్నలను బహిరంగంగా సంధించాడు.

ఇప్పటివరకు కన్నా ప్రశ్నించిన ఈ వంద ప్రశ్నలకు ముఖ్యమంత్రి నుంచి గానీ, మంత్రుల నుంచి గానీ, అధికారుల నుంచి గానీ సమాధానం రాకపోవడంతో ఆ ప్రశ్నలను ఒక పుస్తక రూపంలో పొందుపరిచి ఈ రోజు గవర్నర్‌కు అందజేశారు. గవర్నర్‌ను కలిసిన బృందంలో కన్నాతో పాటు పురంద్రేశ్వరి, కావూరి, ఐవైఆర్‌ కృష్ణా రావు, మణిక్యాల రావు, మాజీ డీజీపీ దినేష్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.

First Published:  23 Nov 2018 6:00 AM GMT
Next Story