Telugu Global
Cinema & Entertainment

నాగ చైతన్యకు నచ్చని లైన్... శర్వానంద్ కి నచ్చిందట!

“కార్తికేయ” సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు చందు మొండేటి. కానీ ఇటీవల మాత్రం నాగ చైతన్య తో “సవ్యసాచి” తెరకెక్కించి ఫ్లాప్ ని అందుకున్నాడు చందు. అయితే చందు దగ్గర “సవ్యసాచి” కంటే కూడా అద్భుతమైన కథ ఒకటి ఉందట. అయితే ఈ కథ నాగ చైతన్య కి చెప్పినా కూడా నాగార్జున కోరిక మేరకు “సవ్యసాచి” లాంటి కథతో సినిమాని తెరకెక్కించాడట. ఇక ఎలాగో సినిమా ఫ్లాప్ అయ్యింది కాబట్టి తన తదుపరి సినిమాకి […]

నాగ చైతన్యకు నచ్చని లైన్... శర్వానంద్ కి నచ్చిందట!
X

“కార్తికేయ” సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు చందు మొండేటి. కానీ ఇటీవల మాత్రం నాగ చైతన్య తో “సవ్యసాచి” తెరకెక్కించి ఫ్లాప్ ని అందుకున్నాడు చందు.

అయితే చందు దగ్గర “సవ్యసాచి” కంటే కూడా అద్భుతమైన కథ ఒకటి ఉందట. అయితే ఈ కథ నాగ చైతన్య కి చెప్పినా కూడా నాగార్జున కోరిక మేరకు “సవ్యసాచి” లాంటి కథతో సినిమాని తెరకెక్కించాడట. ఇక ఎలాగో సినిమా ఫ్లాప్ అయ్యింది కాబట్టి తన తదుపరి సినిమాకి తనకి నచ్చిన లైన్ ని వాడుకుందాం అని డిసైడ్ అయ్యాడట చందు.

ఈ నేపధ్యంలో ఇటీవలే హీరో శర్వానంద్ ని కలిసి లైన్ కూడా చెప్పాడట. శర్వానంద్ కి లైన్ నచ్చి వెంటనే సినిమా చెయ్యడానికి ఓకే చెప్పాడు అని తెలుస్తోంది. కథ మొత్తం రెడీ చేస్తే త్వరగా సినిమా స్టార్ట్ చేద్దాం అని శర్వ చందుకి చెప్పినట్టు టాక్.

ఇదిలా ఉంటే శర్వానంద్ ప్రస్తుతం “పడి పడి లేచే మనసు” సినిమాతో బిజీగా ఉన్నాడు. హను డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా డిసెంబర్ 21 న రిలీజ్ కానుంది. ఈ సినిమాతో పాటు సుధీర్ వర్మ సినిమా అయిపోయాక చందు తో సినిమాని స్టార్ట్ చేస్తాడట శర్వానంద్.

First Published:  25 Nov 2018 1:59 AM GMT
Next Story