Telugu Global
Cinema & Entertainment

"2.0" పై షాకింగ్ కామెంట్స్ చేసిన రజనీకాంత్

2010 లో శంకర్, రజనీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన “రోబో” సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన సినిమా “2.0”. ఈ సినిమా ఈనెల 29న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం హైద‌రాబాద్‌లో చిత్ర‌బృందం విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేసింది. ఇక్క‌డే విజువ‌ల్ ఎఫెక్స్ పై ర‌జ‌నీ ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్ చేశాడు. ఈ సినిమాకి సంబంధించిన గ్రాఫిక్స్ తాను అనుకున్న స్థాయిలో రాలేద‌ని శంక‌ర్ టెన్ష‌న్ ప‌డుతున్నాడ‌ని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ”రోబో కంటే […]

2.0 పై షాకింగ్ కామెంట్స్ చేసిన రజనీకాంత్
X

2010 లో శంకర్, రజనీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన “రోబో” సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన సినిమా “2.0”. ఈ సినిమా ఈనెల 29న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఈ సంద‌ర్భంగా సోమ‌వారం హైద‌రాబాద్‌లో చిత్ర‌బృందం విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేసింది. ఇక్క‌డే విజువ‌ల్ ఎఫెక్స్ పై ర‌జ‌నీ ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్ చేశాడు. ఈ సినిమాకి సంబంధించిన గ్రాఫిక్స్ తాను అనుకున్న స్థాయిలో రాలేద‌ని శంక‌ర్ టెన్ష‌న్ ప‌డుతున్నాడ‌ని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

”రోబో కంటే ఈ సినిమాని శంక‌ర్ చాలా ధీమాతో తీశాడు. కాక‌పోతే చివ‌రిలో బాగా ఒత్తిడికి గుర‌య్యాడు. త‌ను అనుకున్న స్థాయిలో విజువ‌ల్ ఎఫెక్ట్స్ కుద‌ర‌క‌పోవ‌డ‌మే అందుకు కార‌ణం” అని సినిమాలో ఉన్న గ్రాఫిక్స్ గురించి చెప్పాడు రజనీకాంత్.

కానీ ఆ తరువాత దీనిపై శంక‌ర్ కూడా వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సివ‌చ్చింది. ఓ విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ త‌మ‌కు చివ‌రి నిమిషాల్లో హ్యాండిచ్చింద‌ని, అందుకే మ‌రో కంపెనీతో ప‌నిచేయాల్సి వ‌చ్చింద‌ని, ఆ స‌మ‌యంలో ఒత్తిడికి గుర‌య్యాన‌ని, అందుకోస‌మే సినిమా విడుద‌ల ఆల‌స్య‌మైంద‌ని, బ‌డ్జెట్ కూడా పెరిగింద‌ని అందుకే ఆందోళన చెందాను” అని చెప్పుకొచ్చాడు శంకర్.

First Published:  27 Nov 2018 2:00 AM GMT
Next Story