Telugu Global
NEWS

చింతకాయల ఇంట చిచ్చు.... కుమారుల మధ్య వార్‌

ఏపీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇంటిలో పోరు ముదిరింది. సోదరుడితో విభేదాలు పతాక స్థాయికి చేరాయి. ఇప్పుడు రంగంలోకి చింతకాయల సోదరుల కుమారులు కూడా దిగారు. ఎవరికి వారు అధిపత్యం కోసం ఎత్తులు పైఎత్తులు వేస్తున్నారు. మంత్రిని మర్డర్‌ చేసేందుకు చింతకాయల సన్యాసినాయుడు పథక రచన చేశారంటూ వీడియో బయటకు రావడంతో మరింత కలకలం రేగింది. సదరు వీడియోను కొందరు కావాలనే సృష్టించారని.. తానెలాంటి మర్డర్‌ ప్లాన్ చేయలేదని పోలీసులకు సన్యాసినాయుడు ఫిర్యాదు చేశారు. ఈ మర్డర్‌ […]

చింతకాయల ఇంట చిచ్చు.... కుమారుల మధ్య వార్‌
X

ఏపీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇంటిలో పోరు ముదిరింది. సోదరుడితో విభేదాలు పతాక స్థాయికి చేరాయి. ఇప్పుడు రంగంలోకి చింతకాయల సోదరుల కుమారులు కూడా దిగారు.

ఎవరికి వారు అధిపత్యం కోసం ఎత్తులు పైఎత్తులు వేస్తున్నారు. మంత్రిని మర్డర్‌ చేసేందుకు చింతకాయల సన్యాసినాయుడు పథక రచన చేశారంటూ వీడియో బయటకు రావడంతో మరింత కలకలం రేగింది. సదరు వీడియోను కొందరు కావాలనే సృష్టించారని.. తానెలాంటి మర్డర్‌ ప్లాన్ చేయలేదని పోలీసులకు సన్యాసినాయుడు ఫిర్యాదు చేశారు.

ఈ మర్డర్‌ ప్లాన్ సంగతి ఎలా ఉన్నా… చింతకాయల ఇంటిలో పోరు పరాకాష్టకు చేరిందన్నది మాత్రం నిజమేనంటున్నారు. అయ్యన్నపాత్రుడి కుమారుడు విజయ్ ఇటీవల పార్టీ కార్యక్రమాలను సొంతంగా చేపడుతున్నాడు. అయ్యన్న రాజకీయ వారసత్వాన్ని అందుకునేందుకు విజయ్ ఇలా పార్టీకి చెప్పకుండా సొంతంగా కార్యక్రమాలు చేస్తున్నారన్నది ఆరోపణ. దీనిపై సన్యాసినాయుడు సీఎం చంద్రబాబును కలిసి లిఖితపూర్వకంగా అయ్యన్న, ఆయన కుమారుడు విజయ్‌పై ఫిర్యాదు కూడా చేశారు.

కొద్దికాలంగా ఇద్దరు సోదరుల మధ్య మాటలు కూడా లేవు. చింతకాయల సోదరుల మధ్య ఈస్థాయిలో గ్యాప్‌ రావడానికి వారి కుమారులు కూడా ప్రధాన కారణమని చెబుతున్నారు. ఇద్దరి కుమారులు ఎవరికి వారు మోనార్కులం అన్నట్టు వ్యవహరిస్తుండడంతో కుటుంబంలో పరిస్థితి అదుపు తప్పిందని భావిస్తున్నారు.

సన్యాసినాయుడు కుమారుడు వరుణ్‌ కూడా అయ్యన్న, ఆయన కుమారుడి అధిపత్యాన్ని సహించడం లేదు. ప్రస్తుతం చింతకాయల అయ్యన్నపాత్రుడు కాశీ యాత్రలో ఉన్నారు. ఈలోపే మర్డర్‌ ప్లాన్‌ అంటూ ఆరోపణలు రావడం వంటి తీవ్ర పరిణామాలు జరిగాయి. మంత్రి రాక కోసం, ఆయన స్పందన కోసం టీడీపీ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి.

First Published:  28 Nov 2018 10:41 PM GMT
Next Story