Telugu Global
NEWS

మురికి కాలువలో దిగి వైసీపీ ఎమ్మెల్యే ధర్నా

నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనూహ్య రీతిలో నిరసన తెలిపారు. నెల్లూరులోని ఒక వీధిలో మురికి కాలువపై వంతెన కోసం ఏకంగా మురుగులోకి దిగి నిరసన తెలిపారు. మురుగు కాలువపై వంతెన నిర్మించాలని స్థానికులు చాలా కాలంగా చెబుతున్నారు. ఈ విషయాన్ని మున్సిపల్ అధికారుల దృష్టికి స్థానిక ఎమ్మెల్యే తీసుకెళ్లారు. కానీ ఎవరూ స్పందించలేదు. దీంతో శ్రీధర్ రెడ్డి ఏకంగా సదరు మురుగు కాలువలోకి దిగి నిలబడ్డారు. అధికారులు వచ్చే వరకు తాను […]

మురికి కాలువలో దిగి వైసీపీ ఎమ్మెల్యే ధర్నా
X

నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనూహ్య రీతిలో నిరసన తెలిపారు. నెల్లూరులోని ఒక వీధిలో మురికి కాలువపై వంతెన కోసం ఏకంగా మురుగులోకి దిగి నిరసన తెలిపారు.

మురుగు కాలువపై వంతెన నిర్మించాలని స్థానికులు చాలా కాలంగా చెబుతున్నారు. ఈ విషయాన్ని మున్సిపల్ అధికారుల దృష్టికి స్థానిక ఎమ్మెల్యే తీసుకెళ్లారు. కానీ ఎవరూ స్పందించలేదు. దీంతో శ్రీధర్ రెడ్డి ఏకంగా సదరు మురుగు కాలువలోకి దిగి నిలబడ్డారు.

అధికారులు వచ్చే వరకు తాను మురుగు కాలువలోనే ఉంటానని ప్రకటించారు. ఎమ్మెల్యే అలా మురుగు కాలువలో ధర్నాకు దిగడంతో స్థానికులు, వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో వచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే మురుగు కాలువలో నిరసన తెలుపుతున్న విషయం తెలుసుకుని అధికారులు హైరానా పడ్డారు.

First Published:  4 Dec 2018 11:20 PM GMT
Next Story