Telugu Global
NEWS

తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం....ఈనెల 11న తేలనున్న అభ్యర్థుల భవితవ్యం!

తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది. మైకులన్నీ మూగబోయాయి. ప్రచార గడువు బుధవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. సాయంత్రం 5గంటల తర్వాత బహిరంగ సభల నిర్వహణపై నిషేధం విధించింది ఈసీ. ఊరేగింపులు, సినిమా హాల్స్, టీవీలు, సభల ద్వారా ప్రచారం చేయవద్దని ఆంక్షలు పెట్టారు. నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానా లేదా జైలు శిక్ష విధిస్తామని ఇప్పటికే ఈసీ తెలిపింది. ఇక శుక్రవారం జరగనున్న పోలింగ్ కోసం 119 నియోజక వర్గాల్లో ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను […]

తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం....ఈనెల 11న తేలనున్న అభ్యర్థుల భవితవ్యం!
X

తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది. మైకులన్నీ మూగబోయాయి. ప్రచార గడువు బుధవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది.

సాయంత్రం 5గంటల తర్వాత బహిరంగ సభల నిర్వహణపై నిషేధం విధించింది ఈసీ. ఊరేగింపులు, సినిమా హాల్స్, టీవీలు, సభల ద్వారా ప్రచారం చేయవద్దని ఆంక్షలు పెట్టారు. నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానా లేదా జైలు శిక్ష విధిస్తామని ఇప్పటికే ఈసీ తెలిపింది.

ఇక శుక్రవారం జరగనున్న పోలింగ్ కోసం 119 నియోజక వర్గాల్లో ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది.

ఇక ఎన్నికల బరిలో మొత్తం 1,821మంది అభ్యర్థులతో బరిలో ఉండగా…. రాష్ట్ర వ్యాప్తంగా 32815 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. ఇందులో అత్యధికంగా హైదరాబాద్ లో 3873 కాగా వనపర్తిలో 280 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఎన్నికల కోసం 55,329 బ్యాలెట్ యూనిట్లు, 42,751 వీవీ ప్యాట్ యంత్రాలు, 39,763 కంట్రోల్ యూనిట్స్ ను వినియోగించనున్నారు. 649మంది సహాయక రిటర్నింగ్ అధికారులు ఎన్నికల విధుల్లో ఉంటారు.

279 మంది కేంద్ర కంపెనీల బలగాలు రాష్ట్రంలో మోహరించనున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,80,64,684 మంది ఓట్లరు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఫలితాలు ఈనెల 11న వెలువడనున్నాయి.

First Published:  5 Dec 2018 8:46 PM GMT
Next Story