భారీ మెజారిటీతో మళ్లీ గెలుస్తున్నాం.. సాయంత్రం మీరే చూస్తారు- కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి టీఆర్ఎస్ భారీ గెలుపును సొంతం చేసుకోబోతోందని ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. సొంతూరు సిద్దిపేట జిల్లా చింతమడకలో సతీమణితో కలిసి ఓటేసిన కేసీఆర్.. అక్కడే మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో తిరిగి టీఆర్ఎస్ అధికారంలోకి రాబోతోందన్నారు. సాయంత్రం ఎగ్జిట్ పోల్స్లో కూడా ఆ విషయం రుజువు అవుతుందన్నారు. ప్రభుత్వానికి చాలా చాలా అనుకూలమైన పవనాలు ఉన్నాయని… పవనాలు రోజూ మారబోవన్నారు. ప్రభుత్వ అనుకూల ఓటింగ్ భారీగా ఉందన్నారు. పోలింగ్ శాతం కూడా […]
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి టీఆర్ఎస్ భారీ గెలుపును సొంతం చేసుకోబోతోందని ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. సొంతూరు సిద్దిపేట జిల్లా చింతమడకలో సతీమణితో కలిసి ఓటేసిన కేసీఆర్.. అక్కడే మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో తిరిగి టీఆర్ఎస్ అధికారంలోకి రాబోతోందన్నారు. సాయంత్రం ఎగ్జిట్ పోల్స్లో కూడా ఆ విషయం రుజువు అవుతుందన్నారు. ప్రభుత్వానికి చాలా చాలా అనుకూలమైన పవనాలు ఉన్నాయని… పవనాలు రోజూ మారబోవన్నారు.
ప్రభుత్వ అనుకూల ఓటింగ్ భారీగా ఉందన్నారు. పోలింగ్ శాతం కూడా భారీగా నమోదు అవుతుందన్నారు. హైదరాబాద్లోనూ ప్రజలు ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొంటున్నారని కేసీఆర్ చెప్పారు. ఊహించిన దాని కంటే భారీ విజయం టీఆర్ఎస్ సొంతం కాబోతోందన్నారు కేసీఆర్. మరో 15 రోజుల్లో తన సొంతూరు చింతమడక గ్రామానికి వస్తానని కేసీఆర్ చెప్పారు.