భర్తతో విసిగిపోయిన రాణి.... విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు
సామాన్య గృహిణి అయినా.. కోటలో రాణి అయినా గృహ హింసకు ఎవరూ అతీతులుకారు. సూటిపోటి మాటలతో విసిగించే భర్త ఉంటే బంగ్లాలు, ఆడంబరాలు ఆడవాళ్లకు సుఖాన్ని ఇవ్వలేవు. కాని చాలా ఇండ్లలో విడిపోతే పెద్దనేరం అనే భావనతో తమలో తామే సర్థుకుపోయే మహిళలు ఉంటారు. పిల్లలు ఉన్నారనో, బాధ్యతలు ఉన్నాయనో ఆలోచించి భర్తతో ఉండే తగాదాలను కూడా మనసులోనే పెట్టుకుని ఉండే మన దేశంలో….. ఒక రాణి ఏకంగా విడాకులకు దరఖాస్తు చేసుకుంది. అసలేం జరిగిందంటే… రాజస్థాన్లోన […]
సామాన్య గృహిణి అయినా.. కోటలో రాణి అయినా గృహ హింసకు ఎవరూ అతీతులుకారు. సూటిపోటి మాటలతో విసిగించే భర్త ఉంటే బంగ్లాలు, ఆడంబరాలు ఆడవాళ్లకు సుఖాన్ని ఇవ్వలేవు. కాని చాలా ఇండ్లలో విడిపోతే పెద్దనేరం అనే భావనతో తమలో తామే సర్థుకుపోయే మహిళలు ఉంటారు.
పిల్లలు ఉన్నారనో, బాధ్యతలు ఉన్నాయనో ఆలోచించి భర్తతో ఉండే తగాదాలను కూడా మనసులోనే పెట్టుకుని ఉండే మన దేశంలో….. ఒక రాణి ఏకంగా విడాకులకు దరఖాస్తు చేసుకుంది.
అసలేం జరిగిందంటే…
రాజస్థాన్లోన జైపూర్ రాకుమారి.. సవాయి మాధోపూర్ ప్రస్తుత ఎమ్మెల్యే దియా కుమారి విడాకుల కోసం దరఖాస్తు చేశారు. ఆమె 21 ఏళ్ల క్రితమే నరేంద్రసింగ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆమె జైపూర్ మహారాజు భవానీసింగ్ కూతురు. పెళ్లి తర్వాత ముగ్గురు బిడ్డల తల్లి అయిన దియా.. తన భర్తతో విభేదాలు ఏర్పడ్డాయని చెబుతూ విడాకులు కోరింది.
దియా ప్రస్తుతం బీజేపీ తరపున ఎమ్మెల్యేగా ఉన్నారు. కాని ఇంట్లో జరుగుతున్న కలహాల కారణంగా ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఆమె ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయి.