Telugu Global
NEWS

ఆ కులం అమ్మాయిని ప్రేమించడమే చేసిన నేరం " రావెల కిషోర్‌ బాబు

టీడీపీలో అవమానాలు భరించలేకే తాను బయటకు వచ్చానని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు చెప్పారు. గుంటూరు జిల్లాలో మంత్రి పత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాస్, దూళిపాళ్ల నరేంద్ర కలిసి తనను ఇబ్బంది పెట్టారన్నారు. టీడీపీలో దళితులకు పదవులు ఇస్తారు గానీ… అధికారాలు మాత్రం ఇవ్వరన్నారు. పదవి దళితుల వద్ద ఉన్నా దాన్ని నడిపేది మాత్రం వేరే వారు అని విమర్శించారు. దళితుడైన తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు పలు కుట్రలు చేశారన్నారు. గుంటూరు జెడ్పీ చైర్‌పర్సన్ జానీమూన్ […]

ఆ కులం అమ్మాయిని ప్రేమించడమే చేసిన నేరం  రావెల కిషోర్‌ బాబు
X

టీడీపీలో అవమానాలు భరించలేకే తాను బయటకు వచ్చానని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు చెప్పారు. గుంటూరు జిల్లాలో మంత్రి పత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాస్, దూళిపాళ్ల నరేంద్ర కలిసి తనను ఇబ్బంది పెట్టారన్నారు. టీడీపీలో దళితులకు పదవులు ఇస్తారు గానీ… అధికారాలు మాత్రం ఇవ్వరన్నారు. పదవి దళితుల వద్ద ఉన్నా దాన్ని నడిపేది మాత్రం వేరే వారు అని విమర్శించారు.

దళితుడైన తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు పలు కుట్రలు చేశారన్నారు. గుంటూరు జెడ్పీ చైర్‌పర్సన్ జానీమూన్ ఎపిసోడ్‌ను సృష్టించిందే పత్తిపాటి పుల్లారావు అని చెప్పారు. తన కుమారుడు సంజయ్‌ హైదరాబాద్‌లో ఒక మహిళ చేయి పట్టుకుని లాగారన్నది అబద్దమన్నారు.

తన కుమారుడు సంజయ్‌ ఒక అగ్రకుల అమ్మాయిని ప్రేమించారని…. ఇంకా చెప్పాలంటే కమ్మ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడని… వారిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారని రావెల వివరించారు. ఈ విషయం తెలిసి సదరు కులం యువకులు కొందరు కుట్ర చేసి ఈ కేసులో ఇరికించారన్నారు. మీడియా కూడా ఇందుకు సహకరించిందన్నారు. దాంతో తన కుమారుడి జీవితం నాశనమైపోయిందన్నారు.

మీడియా ద్వారా కుట్రలు అమలు చేశారన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో మీడియా కూడా ఎవరి చేతుల్లో ఉందో అందరికీ తెలుసన్నారు రావెల కిషోర్ బాబు.

First Published:  10 Dec 2018 3:55 AM GMT
Next Story