Telugu Global
NEWS

టీడీపీ ప్రభుత్వంలో దళితులకు పదవులున్నాయి‌... కానీ అధికారాల్లేవ్...

ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య సొంత ప్రభుత్వం పైనే ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రభుత్వంలో దళితుల కళ్లలో ఆనందం కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. మంత్రులు నారాయణ, సోమిరెడ్డి సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు  చేశారు. నెల్లూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగించిన వర్ల రామయ్య….  రాష్ట్రంలో తెలుగు దేశం ప్రభుత్వం దళితులకు పదవులు మాత్రమే ఇస్తోంది గానీ… అధికారాలు మాత్రం ఇవ్వడం లేదని ఆరోపించారు. దళితుల బాగు కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే వారి ఆగ్రహాన్ని […]

టీడీపీ ప్రభుత్వంలో దళితులకు పదవులున్నాయి‌... కానీ అధికారాల్లేవ్...
X

ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య సొంత ప్రభుత్వం పైనే ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రభుత్వంలో దళితుల కళ్లలో ఆనందం కనిపించడం లేదని వ్యాఖ్యానించారు.

మంత్రులు నారాయణ, సోమిరెడ్డి సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగించిన వర్ల రామయ్య…. రాష్ట్రంలో తెలుగు దేశం ప్రభుత్వం దళితులకు పదవులు మాత్రమే ఇస్తోంది గానీ… అధికారాలు మాత్రం ఇవ్వడం లేదని ఆరోపించారు.

దళితుల బాగు కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే వారి ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలో దళిత అధికారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని వర్ల రామయ్య ఆరోపించారు.

నేటికీ ఇక్కడ కుల వివక్ష కొనసాగుతోందని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. ఇలా సొంత ప్రభుత్వంపైనే బహిరంగసభ వేదికగా వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.

First Published:  9 Dec 2018 10:19 PM GMT
Next Story