Telugu Global
Cinema & Entertainment

హిట్టు కోసం కసిగా పని చేస్తున్న సాయి ధరం తేజ్

సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ దాదాపు కొన్ని నెలల గ్యాప్ తరువాత తన తదుపరి సినిమాని స్టార్ట్ చేసాడు. “నేను శైలజ” “ఉన్నది ఒక్కటే జిందగీ” వంటి సినిమాలని డైరెక్ట్ చేసిన కిషోర్ తిరుమల ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకి “చిత్రలహరి” అనే టైటిల్ పెట్టారు మూవీ యూనిట్. మొన్నే ముహూర్తం చేసుకున్న ఈ మూవీ వెంటనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళిపోయింది, అలా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లిందో లేదో అప్పుడే […]

హిట్టు కోసం కసిగా పని చేస్తున్న సాయి ధరం తేజ్
X

సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ దాదాపు కొన్ని నెలల గ్యాప్ తరువాత తన తదుపరి సినిమాని స్టార్ట్ చేసాడు. “నేను శైలజ” “ఉన్నది ఒక్కటే జిందగీ” వంటి సినిమాలని డైరెక్ట్ చేసిన కిషోర్ తిరుమల ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకి “చిత్రలహరి” అనే టైటిల్ పెట్టారు మూవీ యూనిట్. మొన్నే ముహూర్తం చేసుకున్న ఈ మూవీ వెంటనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళిపోయింది, అలా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లిందో లేదో అప్పుడే ఇరవై శాతం కి పైగా టాకీ పార్ట్ ని పూర్తీ చేసుకుంది.

దీన్ని బట్టి చూస్తుంటే ఎలాగైనా హిట్టు కొట్టాలి అని చెప్పి సాయి ధరం తేజ్ చాలా కసితో పని చేస్తున్నాడు అని అర్ధం అవుతుంది. మరి వరుసగా ఎదురుకొన్న ఫ్లాప్స్ ని ఈ సినిమాతో తేజ్ అధికమిస్తాడో లేదో చూడాలి. ఇకపోతే ఈ సినిమాలో సాయి ధరం తేజ్ ని పూర్తీ న్యూ లుక్ లో చూపిస్తున్నాడు డైరెక్టర్ కిషోర్ తిరుమల. కళ్యాణి ప్రియ దర్శిని, నివేత థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు.

First Published:  12 Dec 2018 5:33 AM GMT
Next Story