Telugu Global
Cinema & Entertainment

మహర్షి బయ్యర్స్ కి ప్రొడ్యూసర్స్ షాక్?

సూపర్ స్టార్ మహేష్ బాబు 25 వ సినిమాగా తెరకెక్కుతున్న సినిమా “మహర్షి”. ఈ సినిమాలో మహేష్ బాబు గడ్డం పెంచి కనిపించడంతో ఈ సినిమా పై అందరిలోనూ భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాకి మార్కెట్ కూడా అదే స్థాయిలో జరుగుతుంది అను అనుకున్నారు అంతా. అనుకునట్టుగానే ఓవర్సీస్ బయ్యర్లు ఈ సినిమాని కొనడానికి ఎగబడ్డారు, కానీ అలా ఎగబడిన వాళ్లకి దిల్ రాజు ఇంకా అశ్విని దత్ పెద్ద షాక్ ని ఇచ్చారు. […]

మహర్షి బయ్యర్స్ కి ప్రొడ్యూసర్స్ షాక్?
X

సూపర్ స్టార్ మహేష్ బాబు 25 వ సినిమాగా తెరకెక్కుతున్న సినిమా “మహర్షి”. ఈ సినిమాలో మహేష్ బాబు గడ్డం పెంచి కనిపించడంతో ఈ సినిమా పై అందరిలోనూ భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాకి మార్కెట్ కూడా అదే స్థాయిలో జరుగుతుంది అను అనుకున్నారు అంతా. అనుకునట్టుగానే ఓవర్సీస్ బయ్యర్లు ఈ సినిమాని కొనడానికి ఎగబడ్డారు, కానీ అలా ఎగబడిన వాళ్లకి దిల్ రాజు ఇంకా అశ్విని దత్ పెద్ద షాక్ ని ఇచ్చారు.

ఈ సినిమా యొక్క ఓవర్సీస్ రైట్స్ ని 25 కోట్లకి అయితేనే అమ్ముతారట. ఎందుకంటే దిల్ రాజు ద్రుష్టి లో ఈ సినిమాకి భారీగా వసూలు చేసి తన నష్టాల్ని పూడ్చిపెట్టుకుందాం అనుకుంటున్నాడు. కానీ బయ్యర్లు మాత్రం “రోబో 2.o” లాంటి పెద్ద సినిమానే అంత ప్రైజ్ కి కొనలేదు అలాంటిది ఈ సినిమాని కొంటాము అని ఎలా అనుకున్నారు అని అన్నారు అంట. మరి ఈ రేట్ విషయంలో దిల్ రాజు తగ్గుతాడా లేకపోతే బయ్యర్లు తగ్గుతారేమో చూడాలి. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా అల్లరి నరేష్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.

First Published:  12 Dec 2018 11:54 PM GMT
Next Story