Telugu Global
Cinema & Entertainment

ఇద్దరు డైరెక్టర్స్ కి ద్రోహం చేసిన త్రివిక్రమ్

“అరవింద సమేత” లాంటి బ్లాక్ బస్టర్ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏ హీరోని డైరెక్ట్ చేస్తాడా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు. ఎట్టకేలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి సినిమాని అల్లు అర్జున్ తో చెయ్యబోతున్నాడు అనే న్యూస్ బయటకి వచ్చింది. కానీ వీళ్ళిద్దరూ ఈ సినిమా స్టార్ చెయ్యడం వల్ల ఇప్పుడు ఇద్దరు డైరెక్టర్స్ దెబ్బ తిన్నారు. వాళ్ళే విక్రం కే కుమార్, మారుతీ. “హలో” సినిమా హిట్ అయ్యాక అల్లు అర్జున్ కోసం […]

ఇద్దరు డైరెక్టర్స్ కి ద్రోహం చేసిన త్రివిక్రమ్
X

“అరవింద సమేత” లాంటి బ్లాక్ బస్టర్ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏ హీరోని డైరెక్ట్ చేస్తాడా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు. ఎట్టకేలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి సినిమాని అల్లు అర్జున్ తో చెయ్యబోతున్నాడు అనే న్యూస్ బయటకి వచ్చింది. కానీ వీళ్ళిద్దరూ ఈ సినిమా స్టార్ చెయ్యడం వల్ల ఇప్పుడు ఇద్దరు డైరెక్టర్స్ దెబ్బ తిన్నారు. వాళ్ళే విక్రం కే కుమార్, మారుతీ.

“హలో” సినిమా హిట్ అయ్యాక అల్లు అర్జున్ కోసం ఒక కథ రాసుకున్నాడు విక్రం కే కుమార్. దాదాపు ఆ కథని కొన్ని నెలల పాటు అల్లు అర్జున్ తో ఉండి పని చేసాడు కూడా. కానీ అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో సినిమా చెయ్యడం వల్ల ఇప్పుడు ఆ సినిమా ఆగిపోయింది. ఇక విక్రం కే కుమార్ చేసేది లేక అదే కథని నానితో తెరకేక్కిస్తున్నాడు.

ఇక మరో డైరెక్టర్ మారుతీ…. ఈ డైరెక్టర్ “భలే భలే మగాడివోయ్” టైం నుంచి అల్లు అర్జున్ తో సినిమా చెయ్యడానికి ట్రై చేస్తున్నాడు. అల్లు అర్జున్ కూడా మారుతీ కి అవకాశం ఇవ్వాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు… కానీ మారుతీ మాత్రం సరైన కథ వచ్చాకే అల్లు అర్జున్ తో సినిమా అన్నాడు, కట్ చేస్తే కథ సెట్ అయ్యే టైం కి త్రివిక్రమ్ తో సినిమా ఓకే చేసాడు అల్లు అర్జున్. సో ఇప్పుడు త్రివిక్రమ్ వల్ల ఇద్దరు దర్శకులు అల్లు అర్జున్ ని డైరెక్ట్ చేసే అవకాశాన్ని కోల్పోయారు.

First Published:  13 Dec 2018 6:00 AM GMT
Next Story