Telugu Global
Cinema & Entertainment

"జాతి రత్నం"గా అల్లు శిరీష్

“గౌరవం” “కొత్త జంట” వంటి సినిమాలతో కెరీర్ స్టార్టింగ్ లోనే నిరాశపరిచిన అల్లు శిరీష్ ఆ రెండు సినిమాల తర్వాత పరుశురాం దర్శకత్వంలో వచ్చిన “శ్రీరస్తు శుభమస్తు” సినిమాతో హిట్ అందుకొని అల్లు ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత థ్రిల్లర్ జోనర్ లో విఐ ఆనంద్ దర్శకత్వంలో “ఒక్క క్షణం” చేసినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. కానీ ఈ సినిమాని విమర్శకులు మెచ్చుకున్నారు. ఇక ప్రస్తుతం “ఎబిసిడి” అనే సినిమా చేస్తున్నాడు. […]

జాతి రత్నంగా అల్లు శిరీష్
X

“గౌరవం” “కొత్త జంట” వంటి సినిమాలతో కెరీర్ స్టార్టింగ్ లోనే నిరాశపరిచిన అల్లు శిరీష్ ఆ రెండు సినిమాల తర్వాత పరుశురాం దర్శకత్వంలో వచ్చిన “శ్రీరస్తు శుభమస్తు” సినిమాతో హిట్ అందుకొని అల్లు ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత థ్రిల్లర్ జోనర్ లో విఐ ఆనంద్ దర్శకత్వంలో “ఒక్క క్షణం” చేసినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. కానీ ఈ సినిమాని విమర్శకులు మెచ్చుకున్నారు. ఇక ప్రస్తుతం “ఎబిసిడి” అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

కానీ అల్లు శిరీష్ కెరీర్ లో ఇప్పటి వరకు బ్లాక్ బస్టర్ సినిమా లేదు, అందుకే ఈ సారి ఎలాగైన ఒక సాలిడ్ హిట్ కొట్టాలి అని చెప్పి మారుతీ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు అని టాక్. “జాతి రత్నం” పేరు తో మారుతీ రెండేళ్ల క్రితమే రాసుకున్న స్క్రిప్ట్ కి కొద్దిగా మార్పులు చేసి శిరీష్ తో తెరకెక్కించే ప్రయత్నం చేయబోతున్నారని తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. అల్లు శిరీష్ “ఏబిసిడి” పూర్తయ్యాక దీని గురించి ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉందని అని ఫిల్మ్ నగర్ టాక్. ఇక కెరీర్ స్టార్టింగ్ లో శిరీష్ కి ప్లాప్ ఇచ్చిన మారుతీ ఈ సినిమా ద్వారా అయిన హిట్ ఇస్తాడో లేదో చూడాలి.

First Published:  13 Dec 2018 10:49 PM GMT
Next Story