Telugu Global
NEWS

నా వల్లే మూడు రాష్ట్రాల్లో బీజేపీ చిత్తుచిత్తు " బాబు వ్యాఖ్యలతో విస్మయం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖలో జరిగిన బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు అందరినీ విస్మయానికి గురి చేశాయి. ముఖ్యమంత్రి ఏంటి ఇలా మాట్లాడుతున్నారని అందరూ ఆశ్చర్యపోయారు. చంద్రబాబుతో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్ తెలంగాణలో నేలమట్టం అయిపోయింది. ఈ పరిస్థితికి చంద్రబాబే కారణమని కాంగ్రెస్‌ నేతలు రగిలిపోతున్నారు. చంద్రబాబుతో పొత్తు లేకపోయి ఉంటే ఇంత ఘోరంగా ఓడిపోయేవారిమి కాదని చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం తెలంగాణలో తన కూటమి చిత్తుచిత్తు అవడం గురించి మాట్లాడకుండా … రాజస్థాన్‌, చత్తీస్ గడ్‌, […]

నా వల్లే మూడు రాష్ట్రాల్లో బీజేపీ చిత్తుచిత్తు  బాబు వ్యాఖ్యలతో విస్మయం
X

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖలో జరిగిన బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు అందరినీ విస్మయానికి గురి చేశాయి. ముఖ్యమంత్రి ఏంటి ఇలా మాట్లాడుతున్నారని అందరూ ఆశ్చర్యపోయారు. చంద్రబాబుతో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్ తెలంగాణలో నేలమట్టం అయిపోయింది. ఈ పరిస్థితికి చంద్రబాబే కారణమని కాంగ్రెస్‌ నేతలు రగిలిపోతున్నారు. చంద్రబాబుతో పొత్తు లేకపోయి ఉంటే ఇంత ఘోరంగా ఓడిపోయేవారిమి కాదని చెబుతున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం తెలంగాణలో తన కూటమి చిత్తుచిత్తు అవడం గురించి మాట్లాడకుండా … రాజస్థాన్‌, చత్తీస్ గడ్‌, మధ్యప్రదేశ్ ఫలితాల గురించి ప్రసంగించారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ చిత్తుచిత్తుగా ఓడిపోయిందంటే అది తన వల్లేనని చెప్పుకున్నారు. తన వల్లే మూడు రాష్ట్రాల్లో బీజేపీ చిత్తుచిత్తుగా ఓడిపోయిందని… మూడు చోట్ల కాంగ్రెస్ విజయం వెనుక తెలుగుదేశం పార్టీ కృషి ఎంతో ఉందని చెప్పుకొచ్చారు చంద్రబాబు.

తెలంగాణలో తన వల్ల ఏదో నష్టం జరిగిపోయిందని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. తెలంగాణలో టీడీపీని బతికించుకునేందుకు కాంగ్రెస్‌తో కలిసి వెళ్లామని చెప్పారు. కేసీఆర్‌ తనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటున్నారని … ఇది ఎంత వరకు న్యాయమని చంద్రబాబు ప్రశ్నించారు. తానెవరికీ భయపడబోనన్నారు.

First Published:  13 Dec 2018 9:38 PM GMT
Next Story