Telugu Global
NEWS

జగన్‌పై దాడి కేసు.... హైకోర్టు ఆగ్రహం

జగన్‌పై హత్యాయత్నం కేసుపై హైకోర్టులో నేడు మరోసారి విచారణ జరిగింది. ఎన్‌ఐఏ దర్యాప్తుకు మీరు ఆదేశిస్తారా లేదా అన్నది స్పష్టం చేయాలని గత వాయిదాలో కేంద్రానికి హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీల్డ్‌ కవర్‌లో కేంద్రం ఒక నివేదికను హైకోర్టుకు సమర్పించింది. సీల్డ్‌ కవర్‌ నివేదికపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నివేదిక సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్‌ఐఏ దర్యాప్తుకు నేరుగా కేంద్రం ఆదేశించకుండా…. కోర్టు ద్వారా ఆ పనిచేయించే ఉద్దేశంతో కేంద్రం ఉన్నట్టు […]

జగన్‌పై దాడి కేసు.... హైకోర్టు ఆగ్రహం
X

జగన్‌పై హత్యాయత్నం కేసుపై హైకోర్టులో నేడు మరోసారి విచారణ జరిగింది. ఎన్‌ఐఏ దర్యాప్తుకు మీరు ఆదేశిస్తారా లేదా అన్నది స్పష్టం చేయాలని గత వాయిదాలో కేంద్రానికి హైకోర్టు ఆదేశించింది.

ఈ నేపథ్యంలో సీల్డ్‌ కవర్‌లో కేంద్రం ఒక నివేదికను హైకోర్టుకు సమర్పించింది. సీల్డ్‌ కవర్‌ నివేదికపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నివేదిక సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఎన్‌ఐఏ దర్యాప్తుకు నేరుగా కేంద్రం ఆదేశించకుండా…. కోర్టు ద్వారా ఆ పనిచేయించే ఉద్దేశంతో కేంద్రం ఉన్నట్టు అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

కేసును ఎన్‌ఐఏకు బదిలీ చేస్తారా లేదా అన్నది స్పష్టంగా చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈనెల 21లోగా ఆ విషయాన్ని స్పష్టం చేయాలని ఆదేశించింది. ఒకవేళ కేంద్రం ఆ పనిచేయలేకపోతే తామే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.

First Published:  14 Dec 2018 1:06 AM GMT
Next Story