Telugu Global
National

చంద్రుడూ.... ఐయామ్ కమింగ్ " ఓవైసీ!

తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీ సీఎం చంద్రబాబుకు దిమ్మతిరిగే షాకిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఏపీలో తన పని తాను చేసుకుంటున్నారు చంద్రబాబు. తెలంగాణ సీఎం కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పారు. దీనికి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సై అన్నారు. ఇక తెలంగాణ నేతలైతే …బాబును ఓ ఆట ఆడుకుంటున్నారు. తాజాగా ఎంఐఎం అధినేత….ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చెప్పిన డైలాగ్ వైరల్ అవుతోంది. ” మిష్టర్ చంద్రుడూ…. నీగురించి మరిచిపోయా… చంద్రుడు ఐయామ్ కమింగ్ […]

చంద్రుడూ.... ఐయామ్ కమింగ్  ఓవైసీ!
X

తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీ సీఎం చంద్రబాబుకు దిమ్మతిరిగే షాకిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఏపీలో తన పని తాను చేసుకుంటున్నారు చంద్రబాబు. తెలంగాణ సీఎం కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పారు. దీనికి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సై అన్నారు. ఇక తెలంగాణ నేతలైతే …బాబును ఓ ఆట ఆడుకుంటున్నారు.

తాజాగా ఎంఐఎం అధినేత….ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చెప్పిన డైలాగ్ వైరల్ అవుతోంది. ” మిష్టర్ చంద్రుడూ…. నీగురించి మరిచిపోయా… చంద్రుడు ఐయామ్ కమింగ్ టూ ఆంధ్రప్రదేశ్. రెడీగా ఉండూ ” అంటూ సినిమా స్టైల్లో చెప్పిన ఈ డైలాగ్ వీడియోపై నెటిజన్లు తమ టెక్నాలజీ నైపుణ్యంతో వైరల్ చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించిన ఎంఐఎం…. హైదరాబాద్ లోని దారుస్సలాం ఆవరణలో విజయోత్సవ సభను నిర్వహించింది. ఈ సభలో ఓవైసీ ప్రసంగించారు.

ఏపీ సీఎం చంద్రబాబుపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు ఓవైసి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిన చంద్రబాబూ…. నువ్వు ముస్లిం ఐక్యతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తావా? ఆంధ్రప్రదేశ్ కు వస్తా…. నా మిత్రుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా… టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తా… మా తడాఖా ఏమిటో చూపిస్తా… ఇక కాచుకో అంటూ చంద్రబాబును హెచ్చరించారు అసదుద్దీన్ ఓవైసీ.

సొంత రాష్ట్రంలోనే చంద్రబాబుకు తీవ్ర వ్యతిరేకత ఉందని…. లోక్ సభ ఎన్నికల్లో రెండు స్థానాల్లో కూడా టీడీపీ గెలువదని జోస్యం చెప్పారు.

First Published:  15 Dec 2018 9:26 PM GMT
Next Story