Telugu Global
International

మరోసారి సత్తా చాటిన ఇస్రో.... జీఎస్‌ఎల్వీ ఎఫ్‌-11 ప్రయోగం విజయవంతం

వరుస రాకెట్‌ ప్రయోగాలతో విజయవంతంగా దూసుకెళ్తున్న ఇస్రో మరో ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. జీఎస్‌ఎల్వీ -ఎఫ్‌11 ప్రయోగం విజయవంతమైంది. బుధవారం నాలుగు గంటల పది నిమిషాలకు నెల్లూరు జిల్లా శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి నిప్పులు చిమ్ముతూ నింగివైపు జీఎస్‌ఎల్వీ ఎఫ్‌-11 దూసుకుపోయింది. రాకెట్‌ ద్వారా జీశాట్‌ -7 ఏ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టారు. జీశాట్‌- 7ఏ బరువు 2, 250 కిలోలు. జీఎస్‌ఎల్వీ ఎఫ్‌-11 ప్రయోగంతో దేశ కమ్యూనికేషన్ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది. […]

మరోసారి సత్తా చాటిన ఇస్రో.... జీఎస్‌ఎల్వీ ఎఫ్‌-11 ప్రయోగం విజయవంతం
X

వరుస రాకెట్‌ ప్రయోగాలతో విజయవంతంగా దూసుకెళ్తున్న ఇస్రో మరో ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. జీఎస్‌ఎల్వీ -ఎఫ్‌11 ప్రయోగం విజయవంతమైంది.

బుధవారం నాలుగు గంటల పది నిమిషాలకు నెల్లూరు జిల్లా శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి నిప్పులు చిమ్ముతూ నింగివైపు జీఎస్‌ఎల్వీ ఎఫ్‌-11 దూసుకుపోయింది.

రాకెట్‌ ద్వారా జీశాట్‌ -7 ఏ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టారు. జీశాట్‌- 7ఏ బరువు 2, 250 కిలోలు. జీఎస్‌ఎల్వీ ఎఫ్‌-11 ప్రయోగంతో దేశ కమ్యూనికేషన్ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది. ఎయిర్‌ఫోర్స్ సమాచార వ్యవస్థ కోసం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ శాటిలైట్‌ను ఇస్రో తయారు చేసింది.

2013లో ప్రయోగించిన జీశాట్-7 కాలపరిమితి అయిపోవడంతో దాని స్థానంలో జీశాట్-7 ఏ ఉపగ్రహాన్ని ఇస్రో అంతరిక్షంలోకి పంపింది. ఈ ఉపగ్రహం ఎనిమిదేళ్లపాటు సేవలు అందిస్తుంది. భూమి నుంచి రాకెట్ నింగిలోకి ఎగిరిన అనంతరం 19.2 నిమిషాల్లో తన మూడు దశలను పూర్తిచేసుకొని జీశాట్-7 ఏ ఉపగ్రహాం భూస్థిర కక్ష్యలోకి చేరుకుంది.

First Published:  19 Dec 2018 6:00 AM GMT
Next Story