Telugu Global
Cinema & Entertainment

యాత్ర టీజర్.... మరోసారి కళ్లముందు వైఎస్ఆర్

టాలీవుడ్ మోస్ట్ ఎవెయిటింగ్ మూవీస్ లో ఒకటిగా నిలిచిన సినిమా ”యాత్ర”. దివగంత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన చారిత్రక పాదయాత్ర నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమాలో వైఎస్ పాత్రలో మమ్ముట్టి నటిస్తున్నారు. మూవీకి సంబంధించి ఇప్పటికే వైఎస్ లుక్ లో ఉన్న మమ్ముట్టి స్టిల్ ను విడుదల చేశారు. తాజాగా టీజర్ ను కూడా లాంచ్ చేశారు. వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు సందర్భంగా యాత్ర టీజర్ రిలీజైంది. టీజర్ […]

యాత్ర టీజర్.... మరోసారి కళ్లముందు వైఎస్ఆర్
X

టాలీవుడ్ మోస్ట్ ఎవెయిటింగ్ మూవీస్ లో ఒకటిగా నిలిచిన సినిమా ”యాత్ర”. దివగంత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన చారిత్రక పాదయాత్ర నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమాలో వైఎస్ పాత్రలో మమ్ముట్టి నటిస్తున్నారు. మూవీకి సంబంధించి ఇప్పటికే వైఎస్ లుక్ లో ఉన్న మమ్ముట్టి స్టిల్ ను విడుదల చేశారు. తాజాగా టీజర్ ను కూడా లాంచ్ చేశారు.

వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు సందర్భంగా యాత్ర టీజర్ రిలీజైంది. టీజర్ లో అచ్చుగుద్దినట్టు వైఎస్ లా ఉన్నారు మమ్ముట్టి. ఆ పంచెకట్టు, నవ్వు, చేయి ఊపడం ఇలా అన్ని యాంగిల్స్ లో వైఎస్ ను మరోసారి గుర్తుచేశారు మమ్ముట్టి.

”నేను విన్నాను.. నేను విన్నానంటూ” మమ్ముట్టి చెప్పిన డైలాగ్ కూడా టీజర్ లో హైలెట్ గా నిలిచింది. ఈ సినిమాకు మమ్ముట్టి సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు.

మహి వి రాఘవన్ దర్శకత్వంలో 70ఎంఎం ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది యాత్ర సినిమా. సినిమాకు సంబంధించి ఇప్పటికే షూటింగ్ పూర్తిచేశారు. ఫిబ్రవరి 8న వరల్డ్ వైడ్ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. అనసూయ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది.

First Published:  21 Dec 2018 7:21 AM GMT
Next Story