Telugu Global
NEWS

ఆస్పత్రిలో చేరిన అక్బరుద్దీన్ ఓవైసీ....

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఆస్పత్రిలో చేరారు. తీవ్ర కడుపు నొప్పితో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కంచన్‌బాగ్‌లోని ఓవైసీ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఒక విందుకు హాజరైన ఓవైసీకి తీవ్ర నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేర్చారు. కేవలం బంధువులను మాత్రమే ఆయన్ను చూసేందుకు అనుమతిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉన్నట్టు చెబుతున్నారు. గతంలో తనపై దాడి జరిగినప్పటి నుంచి అక్బరుద్దీన్‌ తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఎన్నికల ప్రచారం సందర్బంగానూ తన ఆరోగ్య పరిస్థితిని […]

ఆస్పత్రిలో చేరిన అక్బరుద్దీన్ ఓవైసీ....
X

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఆస్పత్రిలో చేరారు. తీవ్ర కడుపు నొప్పితో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కంచన్‌బాగ్‌లోని ఓవైసీ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు.

ఒక విందుకు హాజరైన ఓవైసీకి తీవ్ర నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేర్చారు. కేవలం బంధువులను మాత్రమే ఆయన్ను చూసేందుకు అనుమతిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉన్నట్టు చెబుతున్నారు.

గతంలో తనపై దాడి జరిగినప్పటి నుంచి అక్బరుద్దీన్‌ తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఎన్నికల ప్రచారం సందర్బంగానూ తన ఆరోగ్య పరిస్థితిని అక్బర్‌ ప్రస్తావించారు.

గతంలో తనపై దాడి జరిగినప్పుడు శరీరంలోకి వెళ్లిన బుల్లెట్ల తాలుకు ముక్కలు కిడ్నీకి సమీపంలో ఉండిపోయాయని వివరించారు. డయాలసిస్ చేయించుకోవాల్సిందిగా వైద్యులు సూచించారని చెప్పారు. ఇప్పుడు తీవ్ర కడుపు నొప్పితో ఆయన ఆస్పత్రిలో చేరడంతో ఎంఐఎం శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.

First Published:  22 Dec 2018 11:01 AM GMT
Next Story